మహానాడుకి ప్రత్యేక కమిటీలు, కన్వీనర్లు
 

by Suryaa Desk | Wed, May 21, 2025, 12:09 PM

తెలుగుదేశం పార్టీ యేటా ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే మహానాడు నిర్వహణకు 19 కమిటీలను నియమించారు. కమిటీల వివరాలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు మంగళవారం విడుదల చేశారు. మహానాడు సమన్వయ కమిటీ కన్వీనర్‌గా మంత్రి లోకేశ్‌ నియమితులయ్యారు. ఈ కమిటీలో పల్లా శ్రీనివాసరావుతోపాటు పలువురు మంత్రులు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కిలారు రాజేశ్‌ ఉన్నారు.


కమిటీలు, కన్వీనర్లు:


ఆహ్వాన కమిటీ: పల్లా శ్రీనివాసరావు (ఏపీ), బక్కని నర్సింహులు (తెలంగాణ)


తీర్మానాల కమిటీ : యనమల రామకృష్ణుడు


వసతి ఏర్పాట్ల కమిటీ : మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు


సభా నిర్వహణ కమిటీ: కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్‌ నాయుడు


భోజనాల కమిటీ : మంత్రి బీసీ జనార్దన్‌ రెడ్డి


మీడియా కమిటీ: ఎన్‌ఎండీ ఫరూక్‌. మంత్రి వంగలపూడి అనిత (కో కన్వీనర్‌), మంత్రి కొలుసు పార్థసారధి (సభ్యులు), బీవీ వెంకటరాముడు (పార్టీ రాష్ట్ర మీడియా కో-ఆర్డినేటర్‌), దారపనేని నరేంద్ర (పార్టీ కేంద్ర కార్యాలయ మీడియా కో-ఆర్డినేటర్‌)


మహానాడు ఆర్థిక వనరుల కమిటీ : మంత్రి అనగాని సత్యప్రసాద్‌


సాంస్కృతిక కార్యక్రమాల కమిటీ : మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌


ఫొటో ప్రదర్శన కమిటీ: మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి


ప్రతినిధుల నమోదు కమిటీ : చింతకాయల విజయ్‌


సభాప్రాంగణ పరిరక్షణ కమిటీ : మంత్రి నిమ్మల రామానాయుడు


అలంకరణ కమిటీ : ఎమ్మెల్యే పులివర్తి నాని


రవాణా కమిటీ: మంత్రి పొంగూరు నారాయణ


వాహన పార్కింగ్‌ కమిటీ: ఏపీఐఐసీ చైర్మన్‌ మంతెన రామరాజు


రక్తదానం, మెడికల్‌ క్యాంప్‌ కమిటీ: మంత్రి డాక్టర్‌ డోలా బాల వీరాంజనేయస్వామి


వలంటీర్ల నిర్వహణ కమిటీ: మంత్రి కొల్లు రవీంద్ర


జనసమీకరణ కమిటీ : మంత్రి గొట్టిపాటి రవికుమార్‌


సుందరీకరణ - పరిశుభ్రత కమిటీ : మంత్రి వాసంశెట్టి సుభాశ్‌

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM