|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 03:04 PM
జార్ఖండ్లోని దుమ్కా జిల్లాలో దారుణ ఘటన ఒకటి ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై ఐదుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మే 17న బాలిక తన బంధువుల ఇంటిలో జరిగే వివాహ వేడుకకు వెళ్తుండగా, నిందితులు ఆమెను బలవంతంగా నిర్జన ప్రదేశానికి ఎత్తుకెళ్ళి అత్యాచారం చేశారు.
ఈ ఘటన తర్వాత నిందితుల చెర నుంచి తప్పించుకున్న బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు ఆధారంగా చర్యలు చేపట్టిన పోలీసులు ఐదుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ ఘటనపై విచారణ కొనసాగుతోంది.