|
|
by Suryaa Desk | Tue, May 20, 2025, 12:39 PM
ఈ నెల 26 నుంచి 29 వరకు కడప జిల్లాలో సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన జరగనుంది. అయితే జిల్లా కలెక్టర్ శ్రీధర్ పలువురు అధికారులకు కలెక్టరేట్లో సోమవారం రాత్రి జరిగిన సమావేశంలో పలు ఆదేశాలు జారీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ పర్యటనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా చూసుకోవాలని విద్యుత్తు, రహదారులు, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం ఏర్పాట్లతో పాటు పోలీసు, అగ్నిమాపక, అత్య వసర వైద్యసేవలు అందుబాటులో ఉండే విధంగా చూడాలన్నారు. ఈ నెల 25వ తేదీ నాటికి అన్ని పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.
Latest News