యూట్యూబర్ జ్యోతి మల్హోత్ర తండ్రి యూటర్న్
 

by Suryaa Desk | Mon, May 19, 2025, 08:53 PM

భారత దేశానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా.. పాకిస్థాన్ నిఘా సంస్థలకు సమాచారం అందిస్తున్నారన్న ఆరోపణలపై ఇప్పటికే అరెస్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఈమెకు పహల్గాం ఉగ్రదాడితో కూడా సంబంధం ఉన్నట్లు నిఘా వర్గాలు అనుమానాలు వ్యక్తం అవుతుండగా.. తాజాగా ఈమె కేసు మరో మలుపు తీసుకుంది. ముఖ్యంగా ఇప్పటి వరకు కూతురును సమర్థించిన ఆమె తండ్రి హరీష్ మల్హోత్రా.. తాజాగా తన వైఖరిని మార్చుకున్నాడు. ముఖ్యంగా తన కుమార్తె తనకు పాకిస్థాన్ వెళ్తున్నట్లు ఎప్పుడూ చెప్పలేదని.. ఢిల్లీకి వెళ్తున్నానని చెప్పి దాయాది దేశానికి వెళ్లిందని వివరించాడు.


హర్యానాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాపై కేంద్ర ప్రభుత్వ అధికార రహస్యాల చట్టం కింద కేసు నమోదు అయింది. విచారణ అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆమె 2023లో ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్‌ను సందర్శించి అక్కడే అహ్సర్ ఉర్ రహీం అనే అధికారితో సంబంధాలు ఏర్పరుచుకున్నట్లు గుర్తించారు. అనంతరం ఆమె రెండు సార్లు దాయాది దేశానికి వెళ్లి, పాక్ గూఢచర్య సంస్థలకు చెందిన వ్యక్తులను కలిసినట్లు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే మొదట్లో తన కూతురు పాకిస్థాన్ వెళ్లిందన్న ఆరోపణలను ఖండించిన హరీష్ మల్హోత్రా.. తాజాగా యూటర్న్ తీసుకున్నాడు.


ముఖ్యంగా ఆమె యూట్యూబ్ వీడియోల కోసమే బయటకు వెళ్తుందని అనుకున్నట్లుగా చెప్పుకొచ్చాడు. విదేశీ పర్యటన గురించి ఏమీ చెప్పలేదని అన్నాడు. ఆమె ఢిల్లీకి వెళ్తుందన్న మాటే వినిపించిందని తాజాగా మీడియాకు స్పష్టత ఇచ్చాడు. ఆమె పాకిస్థాన్ కు వెళ్లిన ప్రతీసారి తనతో ఢిల్లీకి వెళ్తున్నట్లు మాత్రమే చెప్పిందన్నాడు. తాజాగా జ్యోతి మల్హోత్రా చేసిన కామెంట్లతో అందరూ షాక్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. జ్యోతి మల్హోత్రా నుంచి ఇప్పిటికే పోలీసులు ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకొని ఆడియో, వీడియో రికార్డింగ్‌లను పరిశీలిస్తున్నారు. పాక్ వెళ్లేందుకు ఆమెకు వీసా ఎలా మంజూరు అయ్యింది, అక్కడ ఎవరు కలిశారు అనే కోణాల్లో విచారణ కొనసాగుతోంది.


జ్యోతి మల్హోత్రా ‘విజన్ వరల్డ్’ అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్ నడుపుతోంది. పాకిస్థాన్ లోని పలు ప్రాంతాల్లో తీసిన వీడియోలతో ఆమెకు లక్షలాది మంది ఫాలోవర్లు ఉన్నారు. అయితే, ఈ పర్యటనల వెనుక గూఢార్థం ఉందనే అనుమానంతో ఆమెపై చర్యలు ప్రారంభం అయ్యాయి. ఈ కేసు ద్వారా డిజిటల్ మీడియా వేదికలు, ప్రత్యేకించి యూట్యూబ్ వంటివి జాగ్రత్తగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సాంకేతికతను ఉపయోగించి సమాచార చోరీలు జరిగే అవకాశం ఉందన్న సంగతి మరోసారి బయట పడింది.


Latest News
SEBI mulls additional changes to strengthen buyback framework Sat, May 09, 2026, 12:50 PM
Nifty, Sensex rise notably this week as crude prices ease, rupee strengthens Sat, May 09, 2026, 12:48 PM
Allen's range and cleanliness of his hitting make him special: Boucher Sat, May 09, 2026, 12:46 PM
Vijay to meet Thol Thirumavalavan as TVK scrambles for majority in Tamil Nadu Sat, May 09, 2026, 12:44 PM
Suspected food poisoning at Tilak ceremony in Bihar's Gaya, over 40 fall ill Sat, May 09, 2026, 12:41 PM