అన్యమతస్థులు రావడంతో ,,,శ్రీశైలం ఆలయం సీఎస్వోపై సస్పెన్షన్ వేటు
 

by Suryaa Desk | Mon, May 19, 2025, 07:38 PM

ప్రముఖ శైవక్షేత్రమైన నంద్యాల జిల్లా శ్రీశైలం మల్లన్న దేవస్థానం చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నపై సస్పెన్షన్ వేటు పడింది. శ్రీశైలానికి 10 రోజుల క్రితం కొందరు అన్యమతస్తులు వచ్చినట్లు తేలింది.. వారి దగ్గర అన్యమత పుస్తకాలు కూడా ఉన్నాయి. వీరిని గమనించి శ్రీశైలం ఆలయం భద్రతా సిబ్బంది వారిని హెచ్చరించి వెనక్కి పంపించారు సీఎస్‌వోగా ఉన్న అయ్యన్న ఉద్యోగ బాధ్యతలపై నిర్లక్ష్యంగా ఉన్నారంటూ.. శ్రీశైలం మల్లన్న ఆలయ ఈవో సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.. శ్రీశైలంకు అన్యమతస్తులు వచ్చిన ఈ ఘటన ఆలస్యంగా బయటపడింది.


శ్రీశైలం దేవస్థానం క్షేత్ర పరిధిలో టోల్ గేట్ దాటుకుని కొందరు అన్యమతస్తుల సంచరించారనే వీడియోలు స్థానికంగా కలకలం రేపింది. ఈ వీడియోలు ఆధారంగా అన్యమతస్తులు శ్రీశైలంలోకి ఎలా వచ్చారు టోల్ గేట్ దగ్గర సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుని క్షేత్రం పరిధిలోకి వచ్చేటప్పుడు ఎవరు వస్తున్నారు.. ఏంటి అనే విషయంలో నిర్లక్ష్యంగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ క్రమంలో ఈవో శ్రీనివాసరావు చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ అయ్యన్నను వివరణ కోరారు. ఈ క్రమంలో ఈవో శ్రీనివాసరావు విచారణ జరిపి అయ్యన్నను సస్పెండ్ చేశారు.


ఆదోనిలో శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ 93వ వెండి రథోత్సవం ఘనంగా జరుగుతోంది. ఈ ఉత్సవానికి కర్ణాటక, మహారాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివచ్చారు. ఉత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు, అన్నదానం, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. రథోత్సవం సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.


శ్రీ మహాయోగి లక్ష్మమ్మవ్వ ఆదోని ప్రజల ఇలవేల్పుగా పూజలందుకుంటున్నారు. ప్రతి సంవత్సరం ఇక్కడ వెండి రథోత్సవం నిర్వహిస్తారు. ఈ ఉత్సవాన్ని చూడడానికి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు వస్తారు. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తారు.


మహాయోగి లక్ష్మమ్మవ్వ మూలవిరాట్టుకు, బృందావనానికి, శిలాపాదుకలకు అభిషేకం, పుష్ప అలంకారాధి పూజలు నిర్వహిస్తారని ఆలయ నిర్వాహకులు తెలిపారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమం ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి వెండి రథోత్సవం ప్రారంభమవుతుంది. ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 1998 నుంచి వెండి రథాన్ని ఊరేగిస్తున్నారు.


లక్ష్మమ్మవ్వ పేరుతో కో-ఆపరేటివ్ బ్యాంకును ఏర్పాటు చేశారు. ఈ బ్యాంకు ద్వారా చిన్న వ్యాపారులకు, ఉద్యోగులకు రుణాలు అందిస్తున్నారు. దీని ద్వారా వారి ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్నారు. బ్యాంకు దగ్గరలో ఆధ్యాత్మిక కేంద్రం కూడా ఉంది. ఇక్కడ విద్యార్థులకు క్విజ్ పోటీలు నిర్వహిస్తారు. గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు, ప్రశంసా పత్రాలు అందజేస్తారు. పాఠశాల, కళాశాల స్థాయిలో ఎక్కువ మార్కులు సాధించిన విద్యార్థులకు స్వర్ణ పతకాలు అందజేసి సత్కరిస్తారు.


దేవాలయం దగ్గర శుద్ధ జల యంత్రాన్ని ఏర్పాటు చేశారు. దీని ద్వారా ప్రజలకు ఉచితంగా మంచి నీటిని అందిస్తున్నారు. కుట్టు శిక్షణ కేంద్రం ద్వారా మహిళలకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. దీని ద్వారా మహిళలు ఉపాధి పొందేందుకు సహాయం చేస్తున్నారు. ఆలయ వంశపారంపర్య ధర్మకర్త రాచోటి రామయ్య ఆధ్వర్యంలో 1.3 కిలోల బంగారు కిరీటాన్ని తయారు చేయించారు. రథోత్సవం నాడు అమ్మవారికి ఈ కిరీటాన్ని అలంకరిస్తారు. రథోత్సవం సందర్భంగా పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM