|
|
by Suryaa Desk | Sat, May 17, 2025, 07:56 PM
మనిషి ఇంట్లో ప్రశాంతంగా ఉండాలనుకునే ప్లేస్ ఏదైనా ఉంటే అది బాత్రూమ్.. మనిషి ప్రాణానికి అక్కడ కూడా గ్యారెంటీ లేదంటే నమ్ముతారా?. అదేంటి బాత్రూమ్లో ప్రాణాలకు సేఫ్ లేకపోవడం ఏంటని షాకవుతున్నారా.. గ్రేటర్ నోయిడాలో జరిగిన ఘటన గురించి తెలిస్తే నిజమని నమ్ముతారు. ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాకు చెందిన అషు యువకుడు తన ఇంట్లో ఉదయం లేవగానే బాత్రూమ్కు వెళ్లాడు. అక్కడ పని ముగించుకున్న తర్వాత టాయిలెట్ ఫ్లష్ చేశాడు. వెంటనే ఊహించని ఘటన ఎదురైంది.. ఒక్కసారిగా టాయిలెట్ సీట్ బాంబ్లో బ్లాస్ట్ అయ్యింది. వాష్ రూమ్ అంతా మంటలు అంటుకోవడంతో అషు తీవ్రంగా గాయపడ్డాడు. అతడి కాళ్లు, చేతుల, మొహంతో పాటుగా ప్రైవేట్ పార్ట్స్కు గాయాలైనట్లు చెబుతున్నారు. అషును కుటుంబ సభ్యులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో అతడికి 35 శాతం గాయాలైనట్లు డాక్టర్లు చెబుతున్నారు.
టాయిలెట్ సీటు ఇలా పేలడానికి గల కారణాలు ఇంకా తెలియలేదు. కొందరు విద్యుత్ సమస్యల వల్ల పేలిందని అనుమానిస్తున్నారు. ఆ సమయంలో ఏసీతో సహా అన్ని ఎలక్ట్రిక్ పరికరాలు పనిచేస్తూనే ఉన్నాయంటున్నారు. టాయిలెట్ బౌల్లో మీథేన్ గ్యాస్ పేరుకుపోవడం వల్ల పేలుడు సంభవించిందనే వాదన కూడా వినిపిస్తోంది. డ్రైనేజ్ మూసుకుపోవడం వల్ల టాయిలెట్ బౌల్ లోపల గ్యాస్ పేరుకుపోయి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఇక్కడి పైపులు చాలా పాతవని.. వాటిని చాలా సంవత్సరాలుగా శుభ్రం చేయలేదని కొందరు స్థానికులు అంటున్నారు. ఈ క్రమంలో పైపుల్లో గ్యాస్ పేరుకుపోయి ఒత్తిడి పెరిగి పేలిపోయేలా చేసిందని మరో అనుమానం వ్యక్తమవుతోంది.
అయితే టాయిలెట్ వ్యవస్థ సాధారణంగానే పనిచేస్తోందని గ్రేటర్ నోయిడా అథారిటీ సీనియర్ అంటున్నారు.. ఆ ఇంట్లో సమస్య వల్ల పేలుడు జరిగి ఉండొచ్చంటున్నారు. బాత్రూమ్కు వెళ్లిన సమయంలో తన కుమారుడు ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులు ఉపయోగించలేదని అషు తండ్రి సునీల్ ప్రధాన్ అంటున్నారు. ఈ ఘటనతో స్థానికంగా కలకలం రేగింది.. బాత్రూమ్లో కూడా ప్రమాదం పొంచి ఉందా అని భయం వెంటాడుతోంది. టాయిలెట్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మురుగు కాలువలు మూసుకుపోకుండా చూసుకోవాలంటున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫోన్ చేస్తున్న బాలుడు.. చేయొద్ద నాయనా అని చెప్పినా వినకుండా.. ఏం జరిగిందంటే. బాంబ్లా పేలిన టాయిలెట్ సీట్.. యువకుడికి తీవ్ర గాయాలు అయ్యాయి.
Latest News