గల్ఫ్ దేశాల్లో పెరుగుతున్న పాక్ బిచ్చగాళ్లు
 

by Suryaa Desk | Fri, May 16, 2025, 11:48 PM

పాకిస్తాన్ పరిస్థితి రోజురోజుకూ తీవ్ర పతానావస్థకు చేరుకుంటోంది. ఆ దేశం వద్ద విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో.. ప్రభుత్వాన్ని నడపాలంటే ప్రపంచ దేశాలు, అంతర్జాతీయ సంస్థల వద్ద ఎప్పటికప్పుడు రుణాలు అడుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక ఆ దేశంలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటడంతో.. సామాన్య ప్రజలు బతికేందుకే చాలా అవస్థలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే విదేశాలకు వెళ్లి.. యాచించే పరిస్థితులు పాక్‌వాసులకు వచ్చాయి. మరీ ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్లి పాకిస్తాన్ ప్రజలు అడుక్కుంటున్నారు. ఈ క్రమంలోనే గత 16 నెలల్లో సౌదీ అరేబియాలోనే 5 వేలకు మందికి పైగా పాక్ యాచకులను గుర్తించి.. వెనక్కి పంపించింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ హోంశాఖ మంత్రి మొహ్సిన్ నఖ్వీ.. స్వయంగా ఆ దేశ జాతీయ అసెంబ్లీలోనే వెల్లడించడం గమనార్హం.


2024 జనవరి నుంచి ఇప్పటివరకు.. మొత్తం 5402 మంది పాక్ యాచకులను గల్ఫ్ దేశాలు స్వదేశానికి తరలించినట్లు మొహ్సిన్ నఖ్వి తెలిపారు. అందులో ఒక్క సౌదీ అరేబియా నుంచే 5,033 మంది పాకిస్తానీ యాచకులు ఉన్నారని వెల్లడించారు. మరో 5 దేశాల్లో కూడా అడుక్కుంటున్నందుకు మరో 369 మంది పాకిస్తాన్ వాసులను కూడా పట్టుకున్నట్లు వివరించారు. వీరిలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌కు చెందినవారే ఉన్నారని పేర్కొన్నారు. ఇక ఈ యాచకుల సమస్య గురించి.. యూఏఈ కూడా పాకిస్తాన్ ప్రభుత్వం వద్ద లేవనెత్తినట్లు తెలిపారు. మరోవైపు 2023 నవంబర్ నుంచి ఒక 10 లక్షల కంటే ఎక్కువ మంది అక్రమ ఆఫ్ఘనిస్తాన్ వాసులను పాకిస్తాన్ తిరిగి వారి దేశానికి పంపింది. ఈ సందర్భంగా తన సరిహద్దులను కాపాడుకునే హక్కు ప్రతీ దేశానికి ఉంటుందని పాక్ మంత్రి తెలిపారు.


 పాక్ నేషనల్ అసెంబ్లీలో పాకిస్తాన్ పీపుల్స్ పార్టీకి చెందిన సభ్యుడు సెహర్ కమ్రాన్ అడిగిన ప్రశ్నకు మొహ్సిన్ నఖ్వి లిఖితపూర్వక నఖ్వి ఈ వివరాలు వెల్లడించారు. పాకిస్తాన్ హోం మంత్రి అందించిన వివరాల ప్రకారం.. 2024 జనవరి నుంచి ఇప్పటివరకు సౌదీ అరేబియా, ఇరాక్, మలేషియా, ఒమన్, ఖతార్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి మొత్తం 5402 మంది పాకిస్తానీయులను వెనక్కి పంపారని పేర్కొన్నారు. ఈ ఏడాదిలోనే ఇప్పటివరకు 552 మంది విదేశాల నుంచి పాకిస్తాన్‌ వాసులు తిరిగి వచ్చినట్లు తెలిపారు.


అయితే గత 3 ఏళ్ల నుంచి లెక్కలు అందించాలని సెహర్ కమ్రాన్ అడగ్గా.. పాక్ మంత్రి మాత్రం 2024 జనవరి నుంచి ఉన్న వివరాలను మాత్రమే బహిర్గతం చేశారు . ప్రావిన్స్ వారీగా చూస్తే.. ఈ దేశాల నుంచి వెనక్కి వచ్చిన వారిలో ఎక్కువ మంది సింధ్ ప్రావిన్స్‌కు చెందినవారేనని తెలుస్తోంది. తమ దేశాల్లో పాకిస్తాన్ వాసులు అడుక్కుంటున్నారనే కారణంతో వెనక్కి పంపించబడిన వారిలో సింధ్‌ ప్రావిన్స్‌కు చెందిన వారు 2,795 మంది ఉండగా.. పంజాబ్‌ ప్రావిన్స్‌కు చెందిన వారి సంఖ్య 1,437గా ఉంది.


ఈ దేశాల్లో అత్యధికంగా సౌదీ అరేబియా 5033 మంది పాకిస్తానీ యాచకులను వెనక్కి పంపింది. ఆ తర్వాత ఇరాక్ 247 మందిని.. యూఏఈ 58 మందిని పాకిస్తాన్‌కు పంపించింది. మరోవైపు అధికార కూటమిలోని పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ సభ్యుడు అంజుమ్ అఖీల్ ఖాన్ అడిగిన మరో ప్రశ్నకు సమాధానమిచ్చిన హోంమంత్రి మొహ్సిన్ నఖ్వి 2023 నవంబర్ నుంచి అక్రమ విదేశీయుల పునరావాస ప్రణాళిక కింద ఆఫ్ఘన్ సిటిజన్ కార్డ్స్ కలిగి ఉన్నవారితో పాటు 10 లక్షల కంటే ఎక్కువ మంది అక్రమ ఆఫ్ఘన్లను తిరిగి వారి దేశానికి పంపించినట్లు తెలియజేశారు. ప్రతి సార్వభౌమ దేశానికి తన సరిహద్దులను, జాతీయ భద్రతను రక్షించడంలో భాగంగా అక్రమ విదేశీయులను తిరిగి పంపించే హక్కు ఉంటుందని నఖ్వి స్పష్టం చేశారు.

Latest News
Novelty of Rashid Khan has worn off a little, not as intimidating as before, says Kumble ahead of IPL 2026 Sun, Dec 28, 2025, 06:28 PM
Gujarat adding more than 7,000 doctors every year: CM Bhupendra Patel Sun, Dec 28, 2025, 06:27 PM
Meta-owned Instagram hit by brief outage, users report login and app issues Sun, Dec 28, 2025, 05:51 PM
India's youth must lead age of artificial intelligence: Gautam Adani Sun, Dec 28, 2025, 05:48 PM
Ratan Tata reshaped Indian enterprise with integrity: HM Amit Shah Sun, Dec 28, 2025, 05:42 PM