|
|
by Suryaa Desk | Fri, May 16, 2025, 04:12 PM
తుర్కియేకు చెందిన గ్రౌండ్ హ్యాండ్లింగ్ సంస్థ సెలెబీ సేవలను భారత్ నిలిపివేయడంతో ఇస్తాంబుల్ స్టాక్ ఎక్స్ఛేంజ్లో ఆ కంపెనీ షేర్లు మే 16న 10% వరకు పతనమయ్యాయి. "ఆపరేషన్ సిందూర్" సమయంలో పాకిస్థాన్కు తుర్కియే మద్దతు ఇవ్వడంతో భారత్ తీవ్రంగా స్పందించింది.
ఈ నేపథ్యంలో తుర్కియేతో వ్యాపార సంబంధాలను సమీక్షించిన భారత్, సెలెబీ సేవలను రద్దు చేస్తూ కఠిన నిర్ణయం తీసుకుంది. ఫలితంగా, సెలెబీపై పెట్టుబడిదారుల విశ్వాసం సన్నగిల్లడంతో షేర్లు కుప్పకూలాయి.