గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం.. 24 గంటల్లో 62 మంది మృతి
 

by Suryaa Desk | Thu, May 15, 2025, 03:28 PM

గాజాపై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం.. 24 గంటల్లో 62 మంది మృతి

గాజా పట్టణంపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు మరింత తీవ్రతరం అయ్యాయి. దీంతో గడిచిన 24 గంటల వ్యవధిలో కనీసం 62 మంది పాలస్తీనీయులు ప్రాణాలు కోల్పోయారు అని గాజా ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. మృతుల్లో చిన్న పిల్లలు కూడా ఉన్నట్టు అధికారికంగా తెలిపారు.
దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని పునరావాస కేంద్రాలపై జరిపిన దాడుల్లో ఐదుగురు శరణార్థులు మృతి చెందినట్లు వెల్లడించారు. ఈ దాడులు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్నాయని హమాస్ తీవ్ర విమర్శలు గుప్పించింది.
అంతర్జాతీయ సమాజం తక్షణం జోక్యం చేసుకుని ఇజ్రాయెల్ దాడులను ఆపాలని, కాల్పుల విరమణను అమలు చేయాలని హమాస్ పిలుపునిచ్చింది. ప్రస్తుతం గాజాలో పరిస్థితి అత్యంత విషమంగా మారిందని, సాధారణ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ప్రత్యక్ష సాక్ష్యాలు చెబుతున్నాయి.

Latest News
Adverse US travel advisory an embarrassment for India: Congress Tue, Jun 24, 2025, 04:39 PM
Karnataka government being run through commission mafia agents: BJP Tue, Jun 24, 2025, 04:36 PM
EU, Saudi Arabia welcome Iran-Israel ceasefire, call it important for restoring stability Tue, Jun 24, 2025, 04:25 PM
Sensex, Nifty end higher despite Iran-Israel truce tensions Tue, Jun 24, 2025, 04:24 PM
South Korea: Special counsel seeks warrant to detain ex-President Yoon Tue, Jun 24, 2025, 04:23 PM