అయోధ్య వెళ్లేవారికి మరో గుడ్‌న్యూస్.. 24 గంటలు బాలరాముడి దర్శనాలు
 

by Suryaa Desk | Sat, Mar 16, 2024, 10:52 PM

కోట్లాది మంది హిందువులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న కల నెరవేరి ఈ ఏడాది జనవరి 22 వ తేదీన అయోధ్యలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆ తర్వాతి రోజు నుంచి సాధారణ భక్తులకు బాలరాముడి దర్శనాలను శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కల్పిస్తోంది. ఇక రోజురోజుకూ అయోధ్యకు భక్తుల తాకిడి పెరుగుతోంది. దీంతో మొదట ఉన్న దర్శన సమయాన్ని ట్రస్ట్ అధికారులు పెంచారు. ఈ క్రమంలోనే అయోధ్య రామాలయంలో మరో ఉత్సవం జరగనుంది. అయోధ్యలో కొత్త ఆలయం నిర్మితమై బాలరాముడు కొలువైన తర్వాత తొలిసారి శ్రీరాముడి పుట్టిన రోజు వేడుకలకు సమయం ఆసన్నమైంది. ఈ నేపథ్యంలోనే ట్రస్ట్ అధికారులు అయోధ్యలో మరోసారి భారీ ఎత్తున ఉత్సవాలు నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.


శ్రీరాముడి పుట్టిన రోజు ఏప్రిల్ 17 వ తేదీన ఉంది. ఈ నేపథ్యంలోనే ఏప్రిల్ 17 వ తేదీ నుంచి 3 రోజులపాటు ఉత్సవాలు జరపాలని శ్రీరామ తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్ణయించింది. అయోధ్యలో బాలరాముడి ప్రాణ ప్రతిష్ఠ తర్వాత జరిగే తొలి కార్యక్రమం కావడంతో భక్తులు భారీగా తరలివస్తారని అంచనా వేస్తున్న ట్రస్ట్.. అందుకు తగ్గట్లు అయోధ్యలో భారీ ఎత్తున సన్నాహాలు చేస్తోంది. ఇక అధిక సంఖ్యలో అయోధ్యకు భక్తులు తరలి వచ్చే అవకాశం ఉన్నందున వారందరికి బాలరాముడి దర్శనాలు కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఏప్రిల్ 17 వ తేదీ నుంచి 3 రోజులపాటు ఆలయ తలుపులు 24 గంటలూ తెరచి ఉండనున్నాయని ఆలయ అధికారులు వెల్లడించారు.


అయితే కొన్ని సమయాల్లో మాత్రం కొద్దిసేపు మాత్రమే ఆలయ తలుపులు మూసివేయాలని నిర్ణయించినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అయోధ్య బాలరాముడికి నైవేద్యం సమర్పించేటప్పుడు.. అలంకారం చేసేటప్పుడు మాత్రమే భక్తులకు దర్శనాలు తాత్కాలికంగా నిలిపివేయనున్నట్లు తెలిపారు. ఇక శ్రీరాముని జన్మదినోత్సవ వేడుకలకు నెల రోజుల సమయం ఉన్నప్పటికీ అయోధ్యకు వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు జిల్లా అధికారులు ఇప్పటినుంచే ఏర్పాట్లు మొదలుపెట్టారు. దేశ, విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వారికి దర్శనంతోపాటు ఇతర సౌకర్యాలు కల్పించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.


ప్రస్తుతం అయోధ్య రామాలయం తలుపులు సాధారణ భక్తుల దర్శనం కోసం ఉదయం 6:30 గంటల నుంచి రాత్రి 9:30 వరకు తెరిచి ఉంచుతున్నారు. ఈ సమయాల్లోనే భక్తులకు బాలరాముడు దర్శనం ఇస్తున్నాడు. అయితే ఆ బాలక్ రామ్ జన్మదినోత్సవాన్ని పురష్కరించుకొని మూడు రోజుల పాటు దర్శన సమయాన్ని పెంచనున్నారు. ఈ ఉత్సవానికి వివిధ రాష్ట్రాలనుంచి భక్తులు భారీగా తరలివచ్చే అవకాశం ఉందని డివిజనల్ కమిషనర్ గౌరవ్ దయాల్ పేర్కొన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. అయోధ్య బాలరాముడిని దర్శించుకునే భక్తుల కోసం కేంద్ర ప్రభుత్వం, పలు రాష్ట్రాల ప్రభుత్వాలు.. వివిధ రాష్ట్రాల నుంచి అయోధ్యకు ప్రత్యేక రైళ్లను ప్రారంభించారు. కొన్ని విమానయాన సంస్థలు సైతం దేశంలోని అన్ని ప్రధాన నగరాల నుంచి అయోధ్యకు విమానాలు నడుపుతున్నాయి.

Latest News
NADA issues notice to cricketers Yashasvi, Shafali for whereabouts failure Sat, May 09, 2026, 03:23 PM
NADA issues notice to cricketers Yashasvi, Shafali for whereabouts failure Sat, May 09, 2026, 03:23 PM
Gujarat: Air coolers, hydration support deployed at Ahmedabad Zoo to shield wildlife from heatwave Sat, May 09, 2026, 03:23 PM
ED arrests Sriki, 2 others in Karnataka Bitcoin scam Sat, May 09, 2026, 03:20 PM
Woman, 3-month-old baby abducted by armed men in MP's Shivpuri; probe underway Sat, May 09, 2026, 03:19 PM