|
|
by Suryaa Desk | Tue, Mar 12, 2024, 01:56 PM
తమిళనాడులోని తిరుపూర్లో వెల్లకోయిల్ సమీపంలో దారుణం జరిగింది. మార్చి 9న వెల్లకోవిల్ ప్రాంతంలో జరుగుతున్న రథోత్సవ కళా ప్రదర్శనకు 17 ఏళ్ల బాలిక వెళ్లింది.
ఆ ప్రదర్శన చూస్తున్న బాలికను ఆరుగురు వ్యక్తులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయగా, దర్యాప్తు చేపట్టి ప్రభాకరన్, మణికందన్ అనే ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేశారు. మిగిలిన నలుగురి కోసం గాలింపు చేపట్టారు.