|
|
by Suryaa Desk | Sat, Feb 10, 2024, 01:06 PM
మాజీ ప్రధానులు పీవీ నరసింహారావు, చరణ్సింగ్, హరిత విప్లవ పితామహుడు స్వామినాథన్కు ‘భారతరత్న’ను కేంద్రం ప్రకటించడంపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. పీవీకి భారతరత్న ప్రకటించడం ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతికి గర్వకారణమన్నారు. పీవీ తెచ్చిన సంస్కరణలు భారత్ను ప్రపంచ వేదికపై నిలబెట్టాయన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలకు నాంది పలికిన పీవీకి భారతరత్న ప్రకటించడంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ హర్షం వ్యక్తం చేశారు.
Latest News