ఉత్తరాఖండ్ మదర్సా కూల్చివేత హింస: నలుగురు మృతి.. 250 మందికి గాయాలు
 

by Suryaa Desk | Fri, Feb 09, 2024, 10:38 PM

ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో గురువారం మదర్సా కూల్చివేత సందర్భంగా హింస చెలరేగింది. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా.. 250 మంది గాయపడ్డారు. అక్రమంగా నిర్మించిన మదర్సాను కూల్చివేసేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలను స్థానికులు అడ్డుకుని రాళ్ల దాడులతో విరుచుకుపడ్డారు. దీంతో అధికారులు, పోలీసులకు తీవ్ర గాయాలు అయ్యాయి. పరిస్థితి చేయి దాటి పోతుండటంతో అధికారులు కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు జారీ చేశారు. ఘటనా స్థలంలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు.. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.


ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేసి.. పాఠశాలలను కూడా మూసివేశారు. హల్ద్వానీలోని వన్‌భుల్‌పురా ప్రాంతంలో చట్టవిరుద్ధంగా నిర్మించిన మదర్సా, మసీదు కూల్చివేతకు అధికారులు కోర్టు నుంచి అనుమతి తీసుకున్నారు. భద్రత కోసం భారీగా పోలీసులను తీసుకొచ్చారు. అయితే, ఈ చర్యపై స్థానిక ముస్లిం నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురైంది. బుల్డోజర్లతో నిర్మాణాలను ధ్వంసం చేయడంతో ఆగ్రహించిన స్థానికులు, మహిళలతో సహా వీధుల్లోకి వచ్చి నిరసన తెలిపారు. బారికేడ్లను బద్దలు కొట్టి, పోలీసులతో తీవ్ర వాగ్వాదానికి దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఆ తర్వాత అధికారులు, మున్సిపల్ కార్మికులు, జర్నలిస్టులపై ఓ గుంపు రాళ్లు రువ్వారు. 20కిపైగా ద్విచక్ర వాహనాలు, ఓ బస్సును తగులబెట్టారు.


ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ స్పందిస్తూ.. కోర్టు ఆదేశాల మేరకు కూల్చివేతకు అధికార బృందాన్ని పంపించామని తెలిపారు. ఆ ప్రాంతంలోని సంఘ వ్యతిరేకులు పోలీసులతో ఘర్షణ పడ్డారని, ఇది ప్రస్తుత పరిస్థితికి దారితీసిందని సీఎం నొక్కి చెప్పారు. శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి అదనపు పోలీసులు, కేంద్ర బలగాలను మోహరిస్తున్నామని, శాంతిభద్రతలను కాపాడాలని ప్రజలకు ముఖ్యమంత్రి విజ్ఞప్తి చేశారు.


మునిసిపల్ కమీషనర్ పంకజ్ ఉపాధ్యాయ్ మాట్లాడుతూ.. మదర్సా, మసీదును చట్టవిరుద్ధంగా నిర్మించారని పేర్కొన్నారు, హల్ద్వానీ మున్సిపాల్లీ సమీపంలోని మూడు ఎకరాల భూమిని గతంలో స్వాధీనం చేసుకుని నిర్మాణాలకు సీలు వేసిందన్నారు. ముఖ్యమంత్రి, సీనియర్ అధికారులతో జరిగిన సమావేశంలో నిషేధాజ్ఞలు విధించడం, హింసను నియంత్రించడానికి అల్లర్లకు వ్యతిరేకంగా షూట్-ఎట్-సైట్ ఆర్డర్లు ఆవశ్యకతపై చర్చించారు. నగరం మొత్తం కర్ఫ్యూ విధించారు. దీంతో స్కూల్స్, దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అరాచక శక్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. గాయపడినవారికి సోబన్ సింగ్ జీనా హాస్పిటల్‌లో చికిత్స అందజేస్తున్నారు. చాలా మందికి తల, ముఖానికి తీవ్ర గాయాలయ్యాయి. మరోవైపు, కూల్చివేతను ఆపాలంటూ ఉత్తరాఖండ్ హైకోర్టులో గురువారం ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. అయితే, హైకోర్టు సైతం కూల్చివేతను నిలిపివేయాలని ఆదేశించలేదు. తదుపరి విచారణను ఫిబ్రవరి 14కు వాయిదా వేసింది.

Latest News
Mexican president warns against foreign meddling Wed, May 06, 2026, 11:34 AM
Suchi Semicon fully committed to India Semiconductor Mission: Founder on Cabinet's nod Wed, May 06, 2026, 11:28 AM
MP: Two charred to death as car erupts in flames after crashing into electric pole Wed, May 06, 2026, 11:24 AM
Indian companies plan to invest over $20.5 billion in US: Sergio Gor Wed, May 06, 2026, 11:19 AM
New Zealand unemployment down to 5.3 pc in Q1 Wed, May 06, 2026, 11:09 AM