అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి బుగ్గన,,,,రూ.2.86 లక్షల కోట్లతో 2024-45 బడ్జెట్‌ ప్రతిపాదనలు
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 06:28 PM

ఏపీ అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. మూడు నెలల కాలానికి అంటే జూన్ వరకూ ప్రభుత్వం చేయబోయే ఖర్చులకు ఆర్థిక మంత్రి ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బుధవారం ఉదయం 11 గంటల 3 నిమిషాలకు బుగ్గన బడ్జెట్ ప్రసంగం మొదలైంది. శాసన మండలిలో పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.


ప్రధానాంశాలు:


ఏపీ బడ్జెట్ ముఖ్యాంశాలు..


✪ రూ.2,86,389 కోట్లతో ఏపీ బడ్జెట్‌


✪ రెవెన్యూ వ్యయం - రూ. 2,30,110 కోట్లు


✪ మూలధన వ్యయం - రూ. 30,530 కోట్లు


✪ ద్రవ్యలోటు - రూ.55,817 కోట్లు, జీఎస్‌డీపీలో ద్రవ్యలోటు 3.51 శాతం


✪ రెవెన్యూ లోటు రూ.24,758 కోట్లు


  ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రసంగంలోని ముఖ్యాంశాలు..


✪ ఐదేళ్లపాటు బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లభించింది. సహకరించిన అందరికీ ధన్యవాదాలు.


✪ ఐదేళ్ల క్రితం మొదటి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు.. మేనిఫెస్టోను జగన్ పవిత్ర గ్రంథంగా ప్రకటించారని చెప్పాను.


✪ వైఎస్ రాజశేఖర రెడ్డి నిబద్ధత మా పాలనలో ప్రతిఫలించింది.


✪ అర్ధశాస్త్రంలో కౌటిల్యుడు పేర్కొన్న విధంగానే జగన్ పాలన సాగింది.


✪ ఇప్పటి వరకూ ఎవరూ చేయని పనులను జగన్ సర్కారు చేసింది.


✪ 1.35 లక్షల మంది ఉద్యోగులతో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశాం.


✪ వాలంటీర్ల నియామకం ద్వారా సంక్షేమ పథకాలను గడప గడపకూ అందిస్తున్నాం.


✪ కుప్పం సహా అనేక కొత్త రెవెన్యూ డివిజన్లను ఏర్పాటు చేశాం.


✪ కుప్పం పోలీస్ సబ్ డివిజన్‌ను ఆరు పోలీస్ స్టేషన్లతో ఏర్పాటు చేశాం. అందర్నీ సమానంగా చూశామని చెప్పడానికి ఇదే నిదర్శనం.


✪ ప్రతి జిల్లాలో దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశాం.


✪ 99.81 శాతం పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించాం.


✪ ఆరోగ్య రంగంలో నాడు-నేడు పథకం అమలు కోసం రూ.16 వేల కోట్లకుపైగా ఖర్చు చేశాం.


✪ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకు నగదు రహిత వైద్య సేవలను అందిస్తున్నాం. క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎలాంటి పరిమితి లేదు.


✪ ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.


✪ అమ్మఒడి పథకం ద్వారా 43.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ చేశాం. ఈ పథకం వల్ల 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరింది.


✪ స్వయం సహాయక బృందాలకు వైఎస్ఆర్ ఆసరా కింద 2019 నుంచి రూ.25,571 కోట్ల బకాయిలను చెల్లించాం.


✪ వైఎస్సార్ సున్నా వడ్డీ కింద స్వయం సహాయక బృందాలకు రూ.4,969 కోట్లు పంపిణీ చేశాం.


✪ గత ఐదేళ్లలో 30.65 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేశాం.


✪ సుమారు రూ.33 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నాం.


✪ వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించాం. జనవరి నుంచి నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నాం. ఆరోగ్య ఫించన్లను రూ.10 వేలకు పెంచాం.


✪ రూ.20 వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడల్లో ఓడరేవులను నిర్మించాం. వీటి ద్వారా దాదాపు 75 వేల మందికి ఉపాధి లభించనుంది.


✪ రూ.3800 కోట్లతో పది చోట్ల ఫిషింగ్ హార్బర్లను నిర్మిస్తున్నాం.


✪ గత ఐదేళ్లలో రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ. 2626 కోట్లు, జిల్లా రహదారుల అభివృద్ధికి రూ.1955 కోట్లు ఖర్చు చేశాం.


✪ 2023 నవంబర్ నాటికి భారత్ నెట్ ప్రాజెక్ట్ రెండో దశను పూర్తి చేశాం. దీని ద్వారా 613 మండలాల్లోని 11,254 గ్రామ పంచాయతీలను కలుపుతూ 55 వేల కి.మీ. మేర ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్ ఏర్పాటు చేశాం.


✪ కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేశాం.


✪ పోలవరం ప్రాజెక్ట్ హెడ్ వర్క్‌ల పురోగతి 2019 నాటికి 42 శాతం ఉండగా.. ప్రస్తుతం అది 70 శాతానికి చేరింది.


✪ అవుకు మొదటి, రెండు టన్నెళ్ల నిర్మాణం పూర్తయ్యింది. రెండో టన్నెల్ ద్వారా అదనంగా 10 వేల క్యూసెక్కుల నీటిని గండికోట జలశయానికి తీసుకెళ్తారు. మూడో సొరంగం పనులు జరుగుతున్నాయి. ఇది పూర్తయితే కడప చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోని 2.06 లక్షల ఎకరాలకు సాగునీరు, 20 లక్షల మందికి తాగునీరు అందుతుంది.


✪ హంద్రీనీవా సుజల స్రవంతి రెండో దశలో భాగంగా కుప్పం బ్రాంచ్ కెనాల్ నిర్మాణం పూర్తి. త్వరలోనే దీన్ని ప్రారంభించడం ద్వారా కుప్పం నియోజకవర్గంలోని 110 చిన్న చెరువులు, కుంటలకు నీరు అందిస్తాం.


✪ 2019 నుంచి ఇప్పటి వరకూ రాష్ట్రంలో 311కిపైగా భారీ, మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. వీటి ద్వాారా 1.30 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.


✪ సుమారు రూ.6 వేల కోట్లతో ఏర్పాటైన ఎంఎస్ఎఈల ద్వారా 13.67 లక్షల మందికి ఉపాధి లభిస్తోంది.


✪ మైక్రోసాఫ్ట్, జిందాల్, రిలయన్స్, అదానీ, టీఎస్, ఇన్ఫోసిస్, హీరో మోటోకార్ఫ్, యొకోహమా లాంటి దిగ్గజ సంస్థలు గత 4 ఏళ్లలో రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి.


✪ గత ఐదేళ్లలో 4.93 లక్షల కొత్త ఉద్యోగాలు ఇచ్చాం. ఇందులో 2.13 లక్షల ఉద్యోగాలు శాశ్వత నియామకాలు.


✪ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 60 ఏళ్ల నుంచి 62 ఏళ్లకు పెంచాం.


✪ 2018-19లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 11 శాతం ఉండగా.. 2023 నాటికి 16.2 శాతానికి చేరుకుంది.


✪ రైతులందరికీ ఉచిత పంటల బీమా అమలు చేసిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.


✪ చేపల ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ వాటా 30 శాతం. సముద్ర ఆహార ఎగుమతుల్లో 31 శాతం వాటాతో దేశంలో ముందంజలో ఉన్నాం.


✪ 15వ ఆర్థిక సంఘాన్ని ఒప్పించి రూ.30,497 కోట్ల రెవెన్యూ లోటు గ్రాంటును సాధించుకోగలిగాం.


బడ్జెట్‌కు ముందు కీలక విషయాలు వెల్లడించిన ఆర్థిక మంత్రి..


✪ బడ్జెట్‌లో సంక్షేమానికే పెద్దపీట ఉంటుంది: ఆర్థిక మంత్రి బుగ్గన


✪ విద్య, వైద్యం, మహిళ సాధికారిత, వృద్ధులకు ప్రాధాన్యం: ఆర్థిక మంత్రి బుగ్గన


✪ సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం ఒక బెంచ్ మార్క్: ఆర్థిక మంత్రి బుగ్గన


✪ మూడో రోజు అసెంబ్లీ సమావేశాల్లోనూ టిడిపి సభ్యుల ఆందోళన


✪ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టిన టిడిపి ఎమ్మెల్యేలు


✪ రైతు వ్యతిరేక ప్రభుత్వం, పోలవరం కట్టలేకపోయిన ప్రభుత్వం అంటూ నినాదాలు


✪ సభ జరగకుండా ఆటంకాలు.. టీడీపీ ఎమ్మెల్యేలని సస్పెండ్ చేసిన స్పీకర్


✪ ముగిసిన కేబినెట్ సమావేశం.. బడ్జెట్‌కి ఆమోదం


కేబినెట్ భేటీలో మరికొన్ని కీలక నిర్ణయాలు


✪ 2024–25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆమోదించిన మంత్రిమండలి.


✪ నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల.


✪ నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల.


✪ ఆంధ్రప్రదేశ్‌ ప్రైవేట్‌ యూనివర్శిటీస్‌ (ఎస్టాబ్లిస్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్‌ కేటగిరిలో మూడు ప్రేవేట్‌ యూనివర్శిటీలకు అనుమతి. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి.


✪ ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలో 05–02–2024 నాడు ఉభయసభలనుద్దేశించి ప్రసంగించిన... గవర్నర్‌ ప్రసంగానికి ఆమోదం తెలిపిన మంత్రిమండలి.


ఆంధ్రప్రదేశ్ 2024–25 ఆర్థిక సంవత్సరం ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది .రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్‌ సరిగ్గా ఉదయం 11.03 నిమిషాలకు 2024–25 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అయితే ఎన్నికలు జరగనున్న క్రమంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) ఓటాన్‌ అకౌంట్‌ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. ఇటు శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెడతారు.


అన్ని ప్రభుత్వశాఖలు రూ.3.20 లక్షల కోట్లకు బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాస్తవ ఖర్చు ఆధారంగానే కేటాయింపులు ఉంటాయని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో లెక్కలను సవరించనున్నారు. ప్రస్తుతం జనవరి నెలాఖరు వరకే ఖర్చులు జరిగాయి. ఆర్థిక సంవత్సరం మొత్తానికి అంచనాలు సవరిస్తారు. ప్రస్తుత ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌లో ఆయా శాఖల కేటాయింపులు కూడా అంతకుమించి చేయకూడదనే సూత్రంతో వ్యవహరిస్తున్నారు. కేంద్రసాయంతో అమలు చేసే పథకాలకు రాష్ట్రం తన వాటా నిధులు సరిగా ఇవ్వట్లేదు. రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యాలకు అనుగుణంగా ఉన్న పథకాలకే బడ్జెట్‌లో కేటాయింపులు చూపే అవకాశం ఉంది.


ఇవాళ సభలో మూడు బిల్లుల్ని ప్రవేశపెడతారు. ఏపీ అసైన్డ్ ల్యాండ్స్ (బదిలీ నిషేధ సవరణ) బిల్లు -2024, ఏపీ ఉద్యోగుల నియామకాలు, క్రమబద్ధీకరణ, రేషనైజేషన్ సంబంధిత సవరణ బిల్లు -2024 (రెగ్యులరైజేషన్ ఆఫ్ అపాయింట్మెంట్స్ టు పబ్లిక్ సర్వీస్ అండ్ రెగ్యులరైజేషన్ ఆఫ్ స్టాఫ్ పాటర్న్స్ అండ్ పే స్ట్రక్చర్ సవరణ బిల్లు). ఆర్జేయుకేటీ విశ్వవిద్యాలయం సవరణ బిల్లు -2024ను సర్కారు ప్రవేశపెట్టనుంది.

Latest News
Mortal remains of Ujjain student arrive from Canada; CM Mohan Yadav pays tributes Fri, Apr 03, 2026, 12:14 PM
India's fisheries sector draws Rs 39,272 crore investment since 2015, seafood exports double Fri, Apr 03, 2026, 12:09 PM
I want to prove that winning IPL trophy last season was not a one-off, says RCB wicketkeeper Jitesh Fri, Apr 03, 2026, 12:06 PM
US intel finds Iran retains significant strike capacity: Report Fri, Apr 03, 2026, 12:02 PM
UN experts warn of life-threatening health risks for Pakistani activist Idris Khattak Fri, Apr 03, 2026, 11:57 AM