ఏపీ బడ్జెట్ రూ.2,86,389 కోట్లు,,,రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు,,,,రూ.55,817 కోట్ల ద్రవ్యలోటు
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 06:20 PM

ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.2,86,389 కోట్ల అంచనాలతో ఓటాన్‌ ఎకౌంట్‌ బడ్జెట్‌ను మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం, రూ.30,530 కోట్ల మూలధన వ్యయంతో పద్దును ప్రతిపాదించారు. రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు, రూ.55,817 కోట్ల ద్రవ్యలోటును అంచనా వేశారు. రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో 3.51 శాతం మేర ద్రవ్యలోటు, 1.56 శాతం రెవెన్యూ లోటు ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక సంవత్సరం మొత్తానికి బడ్జెట్‌ ప్రతిపాదనలు సమర్పించినా ఏప్రిల్‌ నుంచి జులై నెలల వరకే ఆమోదం తీసుకుంటారు. పూర్తిస్థాయి బడ్జెట్‌ను ఎన్నికల తర్వాత కొత్తగా కొలువుదీరే ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది.


ఖాతాలు 2022-23


ఆంధ్రప్రదేశ్‌ అకౌంటెంట్‌ జనరల్‌ ఖరారు చేసిన ఫైనాన్స్‌ ఖాతాలు రెవెన్యూ లోటు రూ. 44,487.49 కోట్లు, మరియు ద్రవ్య లోటు రూ. 52,508.34 కోట్లు, ఇది ఆర్థిక సంవత్సరానికి 2022-23కి GSDPలో వరుసగా 3.30% మరియు 3.98%.


సవరించిన అంచనాలు 2023-24


2023-24 ఆర్థిక సంవత్సరం కోసం రెవెన్యూ వ్యయం కోసం సవరించిన అంచనా రూ. 2,28,237.77 కోట్లు.. అయితే మూలధన వ్యయం కోసం ఇది రూ.27,308.12 కోట్లు. 2023-24లో రెవెన్యూ లోటు దాదాపు రూ. 31,534.94 కోట్లు, అదే కాలానికి ద్రవ్య లోటు దాదాపు రూ. 60,153. 59 కోట్లు, ఇది 6592లో వరుసగా 2.19% , 4.18%. రాష్ట్ర సమస్యల పరిష్కారానికి పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాల్ని అవలంబించామని బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి బుగ్గన తెలిపారు. పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌరసేవలను ప్రజల వద్దకు తీసుకెళ్లేలా చర్యలు చేపట్టామన్నారు. గత ఐదేళల్లో ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలతో పాటుగా సాధించిన విజయాలను ప్రసంగంలో ప్రస్తావించారు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్.. ఆయన మాటల్లో ఆ విజయాలు ఇలా ఉన్నాయి.


* 2018-19 సంవత్సరంలో 11% రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటుతో 14వ స్థానంలో ఉండగా.. 2023 సంవత్సరంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి రేటు 16.2%నికి పెరగటం వలన 4వ స్టానానికి పురోగతి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో జరిపిన వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక ప్రకారం, సులభతర వాణిజ్యంలో మన రాష్ట్రం అగ్రస్థానం కైవసం చేసుకుంది. 2018-19 సంవత్సరంలో రాష్ట్ర వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ధి రేటు 8.3 శాతంతో 12వ స్థానంలో ఉండగా.. ఇప్పుడు రాష్ట్రం 13% వ్యవసాయ రంగ సమ్మిళిత వార్షిక వృద్ది రేటుతో 6వ స్థానంలో ఉంది. వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని రైతులందరికీ వర్తింపచేసిన మొదటి, ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.


* రాష్ట్రంలో 13 లక్షల 5 వేల మంది రైతులకు సేవలను అందిస్తూ, రైతు భరోసా కేంద్రాలు ప్రపంచ బ్యాంకుచే ప్రశంసలు అందుకున్నాయి. ఇథియోపియా, బంగ్లాదేశ్‌ మరియు వియత్నాం దేశాల నుండి వచ్చిన ప్రతినిధులు రాష్ట్రంలో రైతులకు విత్తనం నుంచి అమ్మకం వరకు అందిస్తున్న భరోసాను చూసి తమ తమ దేశాలలో అనుకరించాలనుకుంటున్నారు. సూక్ష్మ నీటిపారుదల పద్ధతి అమలులో రాష్ట్రం రెండవ స్థానంలో ఉంది. అంతే కాకుండా దేశంలోని మొదటి 15 జిల్లాలలో, 6 జిల్లాలు రాష్ట్రం నుంచే ఉన్నాయి.


* భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్)- జాతీయ అరటి పరిశోధన సంస్థల నుంచి ఎగుమతి కార్యకలాపాలకు ఉత్తమ రాష్ట్ర అవార్డును రాష్ట్రం గెలుచుకుంది. 2019 సంవత్సరానికి ముందు 387 మెట్రిక్‌ టన్నుల అరటిని మాత్రమే ఎగుమతి చేయగా.. ఇప్పుడు ఒక లక్ష 67 వేల మెట్రిక్‌ టన్నుల అరటిని ఎగుమతిని చేస్తున్నారు. రాష్ట్రం మొత్తం చేపల ఉత్పత్తిలో 30% వాటాతో.. మొత్తం సముద్ర ఆహార ఎగుమతులలో 31% తో దేశంలోనే ముందంజలో ఉంది. అందుకు ఫలితంగా 2023 సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వంచే ఉత్తమ సముద్ర తీర రాష్ట్రంగా అవార్డును అందుకుంది.


* పుంగనూరు పశువులను సంరక్షిస్తున్నందుకుగాను, శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం, తిరుపతి భారతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్) నుంచి బ్రీడ్‌ కన్షర్వేషన్‌ అవార్డును అందుకుంది. వ్యవసాయ మార్కెట్‌ కమిటీలలో షెడ్యూలు కులాల, షెడ్యూలు తెగల, వెనుకబడిన తరగతులకు చెందిన మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో రాష్ట్రం ౩వ స్థానంలో ఉంది.


* కొత్త సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల రిజిస్ట్రేషన్లు 2020 సంవత్సరంలో 65,174 నమోదు కాగా.. 2023 సంవత్సరంలో ఈ రిజిస్ట్రేషన్‌లు 7 లక్షల 20 వేలకు పెరిగాయి. దేశంలో 5% వాటాతో మహిళల యాజమాన్యంలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల అభివృద్ధి పరంగా ఆంధ్రప్రదేశ్ 7వ స్థానంలో ఉంది. 2017 సంవత్సరానికి ఒక లక్ష 17 వేల మంది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థలలో ఉపాధి పొందుతుండగా, ఉద్యమ్‌ పోర్టల్‌ క్రింద ఈ ఉపాధి కల్పన 2023 సంవత్సరం నాటికి గణనీయంగా పెరిగి, ఈ తరహా సంస్థలలో 277 లక్షల 45 వేల మంది ఉద్యోగులు ఉపాధిని పొందుతున్నారు. రాష్ట్రంలో 'ఒక జిల్లా-ఒక ఉత్పత్తి క్రింద ఉప్పాడ జమ్జానీ చీరలకు బంగారు బహుమతిని పొందటమే కాకుండా, చేనేత ఉత్పత్తుల క్రింద మరో నాలుగు అవార్జులను అందుకుంది. ప్రధాన మంత్రి పట్టణ ఆవాస యోజన క్రింద ఉత్తమ పనితీరు అవార్డును ఆంధ్రప్రదేశ్ అందుకుంది. అదే విధంగా, రాష్ట్రానికి చెందిన ముగ్గురు లబ్ధిదారులు ప్రధానమంత్రి నుంచి ఉత్తమ గృహ నిర్మాణ అవార్డులను అందుకున్నారు.


 మైక్రోసాఫ్ట్‌, జిందాల్‌, రిలయన్స్‌, అదానీ, లారస్‌ సింథసిస్‌, Tవంటి అనేక దిగ్గజ పరిశ్రమలు గత నాలుగేళ్లలో రాష్ట్రంలో గణనీయంగా పెట్టుబడులు పెట్టాయి. రాష్ట్రంలో 2022 సంవత్సరానికి గాను, అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాల జాబితాలో ౩వ స్థానాన్ని పొందింది. విశాఖలోని రుషికొండ బీచ్‌ అత్యంత పర్యావరణ అనుకూలమైన చీచ్‌గా “బ్లూ ష్లాగ్‌ లేబుల్‌ను పొందింది. 2023 సంవత్సరానికిగాను ఉత్తమ పర్యాటక గ్రామంగా లేపాక్షి కేంద్ర ప్రభుత్వ అవార్డు పొందింది.


* ఆంధ్రప్రదేశ్ క్లీన్ అండ్ గ్రీన్‌ పునరుత్పాదక ఇంధనం ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను ప్రోత్సహించడం, పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు బాధ్యతలను నెరవేర్చటం, ఇంధనం మరియు మౌలిక సదుపాయాల వినియోగం అనే మూడు అంశాలకుగాను, రాష్ట్రం 15వ ఎనర్షియా అవార్డు-2023 క్రింద మూడు అవార్డులను అందుకుంది. పాలసముద్రంలో అత్యాధునిక వసతులతో నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కస్టమ్స్‌, ఇన్‌ డైరెక్ట్‌ టాక్సెస్‌ అండ్‌ నార్మోటిక్స్‌ కి ప్రాంగణాన్ని స్థాపించడంలో ప్రభుత్వం మద్దతు ఇచ్చింది. 500 ఎకరాల విస్తీర్ణంలో, ఈ ప్రధాన కార్యాలయంలో కేంద్ర, రాష్ట్ర, భాగస్వామ్య దేశాలలోని రెవున్యూ సర్వీస్‌ ఆఫీసర్‌ల సామర్థ్య పెంపుకై శిక్షణను అందించటం జరుగుతుంది.


* గ్రామ పంచాయతీలలో థీమాటిక్‌ అప్రోచెస్-హెల్తీ విలేజ్‌ ద్వారా సుస్థిర అభివృద్ధి లక్ష్యాల స్థానికీకరణ కోసం పంచాయితీ రాజ్‌ మంత్రిత్వ శాఖ, కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో 2024 జనవరిలో ౩ రోజుల జాతీయ శిక్షణా శిబిరాలను తిరుపతిలో నిర్వహించింది. 2023 ఫిబ్రవరిలో తిరుపతిలో ఇండియా ఎలక్రానిక్స్‌ అండ్‌ సెమీకండక్టర్‌ అసోసియేషన్‌ భాగస్వామ్యంతో డిఫెన్స్‌ ఎలక్రానిక్స్‌, సెమీకండక్టర్‌ ఇన్నోవేషన్‌ సమావేశాలను నిర్వహించారు.


Latest News
Sanskrit Mahavidyalaya will be 'centre of consciousness' for Vedic knowledge, says Gujarat CM Sat, Apr 04, 2026, 03:33 PM
IPL 2026: Suryakumar leads MI in Hardik's absence as unchanged DC elect to bowl first Sat, Apr 04, 2026, 03:28 PM
JD-U supporters hold posters, urge Nitish Kumar to reconsider RS decision Sat, Apr 04, 2026, 03:27 PM
US govt proposes expanding ban on Chinese tech equipment Sat, Apr 04, 2026, 03:19 PM
OTR norms eased for equity options, effective from April 6 Sat, Apr 04, 2026, 03:15 PM