నా చెడు కోరుకుంటున్నారు.. భద్రతపై షర్మిల సంచలన వ్యాఖ్యలు
 

by Suryaa Desk | Wed, Feb 07, 2024, 06:10 PM

ఏపీ ప్రభుత్వం తనకు సెక్యూరిటీని తగ్గించిన విషయంలో ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తొలిసారిగా స్పందించారు. తన భద్రతపై కీలక వ్యాఖ్యలు చేశారు. బాపట్లలో జరిగే రచ్చబండ కార్యక్రమ కోసం హైదరాబాద్ నుంచి వైఎస్ షర్మిల గన్నవరం వచ్చారు. ఇండిగో విమానంలో కేవీపీ రామచంద్రరావుతో కలిసి గన్నవరం విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో మాజీమంత్రి రఘువీరారెడ్డి, సుంకర పద్మశ్రీ, నరహరిశెట్టి నరసింహారావు ఇతర కాంగ్రెస్ నేతలు షర్మిలకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన షర్మిల.. వైసీపీ, టీడీపీ పార్టీల తీరును తప్పుబట్టారు. అలాగే సెక్యూరిటీని తగ్గించడంపైనా కీలక వ్యాఖ్యలు చేశారు.


కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా తాను రాష్ట్రమంతటా తిరగాలన్న షర్మిల.. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం తనకు భద్రత కల్పించాలని అన్నారు. కానీ అవేవీ పట్టించుకోకుండా, కనీసం మహిళనని కూడా చూడకుండా, తాము అడిగినా రాష్ట్ర ప్రభుత్వం సెక్యూరిటీని కల్పించడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రజాస్వామ్యం గురించి చిత్తశుద్ధి ఉందా, ప్రజాస్వా్మ్యం అసలు గుర్తుందా అంటూ నిలదీశారు. మీకు సెక్యూరిటీ ఉంటే సరిపోతుందా.. మిగతా వారికి, ప్రజలకు భరోసా కల్పించవలసిన పరిస్థితి, ప్రతిపక్షాలకు రక్షణ కల్పించవలసిన బాధ్యత లేదా అని ప్రశ్నించారు. అడిగినా కూడా సెక్యూరిటీ కల్పించడం లేదంటే మా చెడు కోరుకుంటున్నారనే కదా అర్థం.. ఇదెక్కడి ప్రజాస్వామ్యమని వైఎస్ షర్మిల నిలదీశారు. అయితే గతంలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలిగా ఉన్న సమయంలో తెలంగాణలో షర్మిల పాదయాత్ర చేశారు. అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం షర్మిలకు 4+4 సెక్యూరిటీ కల్పించిందనీ .. ఏపీ పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టాక జగన్ సర్కారు ఆమె భద్రతను 1+1కు తగ్గించిందని కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.


మరోవైపు అసెంబ్లీ సమావేశాల్లో అధికార, విపక్షాలు రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై ఆలోచించాలని వైఎస్ షర్మిల కోరారు. ఈ విషయమై చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్‌లకు లేఖలు కూడా రాసినట్లు తెలిపారు. ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుగా పేర్కొన్న వైఎస్ షర్మిల.. పదేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ వీటి గురించి ఆలోచించలేదని అన్నారు. చంద్రబాబు, వైఎస్ జగన్ కూడా తమ స్వలాభం చూసుకున్నారే కానీ.. రాష్ట్రం గురించి ఆలోచించలేదని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని డిమాండ్ చేశారు. ఒకరేమో కుర్చీ ఎలా కాపాడుకోవాలని, మరొకరేమో కుర్చీ ఎలా సంపాదించాలనే పనిలో ఉన్నారని షర్మిల విమర్శించారు. జగన్‌కు, చంద్రబాబుకు రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే పరిస్థితి లేదన్న షర్మిల.. వైసీపీ, టీడీపీ, బీజేపీలను ఇంటికి పంపి కాంగ్రెస్‌ను ఆశీర్వదిస్తేనే రాష్ట్రానికి మంచి జరుగుతుందన్నారు.

Latest News
Banning Telegram triggered 'massive banking failure' in Russia: Founder Pavel Durov Sat, Apr 04, 2026, 04:04 PM
Taiwan must build 'self-deterrence' to counter Chinese threat: Report Sat, Apr 04, 2026, 04:01 PM
IPL 2026: It's just about trying to manage conditions, maximize powerplay to its best, says Rickelton Sat, Apr 04, 2026, 04:00 PM
Sanskrit Mahavidyalaya will be 'centre of consciousness' for Vedic knowledge, says Gujarat CM Sat, Apr 04, 2026, 03:33 PM
IPL 2026: Suryakumar leads MI in Hardik's absence as unchanged DC elect to bowl first Sat, Apr 04, 2026, 03:28 PM