ఏపీలో నవరత్నాల ద్వారా పేదరిక నిర్మూలనే ప్రభుత్వ లక్ష్యం.. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం
 

by Suryaa Desk | Mon, Feb 05, 2024, 10:05 PM

ఏపీ అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలు ప్రారంభమయ్యాయి. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఉభయ సభల్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఏపీ ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయన్నారు గవర్నర్. ఈ ప్రభుత్వం ఇప్పటివరకూ నాలుగు బడ్జెట్లు ప్రవేశపెట్టిందని.. సామాజిక న్యాయం, సమానత్వం కోసం ప్రభుత్వం పని చేస్తోందన్నారు. విజయవాడలో అంబేద్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించారని.. అంబేద్కర్‌ విగ్రహం ఏర్పాటు అభినందనీయం అని ప్రశంసించారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.. ఇది పేదల ప్రభుత్వమన్నారు. ప్రజల జీవన ప్రమాణాల మెరుగయ్యేందుకు కృషి చేస్తున్నారని..


నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా విద్యా సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. పేద పిల్లలకు గ్లోబల్‌ ఎడ్యుకేషన్‌ అందిస్తున్నారని.. మనబడి నాడు-నేడు ద్వారా స్కూళ్ల రూపరేఖలు మారిపోయాయన్నారు. విద్యారంగంపై రూ. 73, 417 కోట్లు ఖర్చు చేశారని.. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేలా బోధనను అందిస్తున్నారన్నారు. 8,9 తరగతుల విద్యార్థులకు 9, 52, 925 ట్యాబ్‌లు పంపిణీ చేశారని.. వచ్చే ఏడాది జూన్‌ నుంచి 1వ తరగతి నుంచి ఐబీ విధానం అమలు చేయడంతో పాటుగా.. ప్రతి ఏటా ఒక తరగతికి ఐబీ విధానం పెంచుకుంటూ వెళ్తారన్నారు.


విదేశాల్లో చదువుకునే విద్యార్థుల కోసం విదేశీ విద్యాదీవెన పథకం అమలు చేస్తున్నారన్నారు గవర్నర్. అత్యున్నత విద్యాసంస్థల్లో గుర్తించిన 21 ఫ్యాక్టరీలలో ఏ విభాగంలోనేనా విదేశీ విద్యను అభ్యసించవచ్చన్నారు. ఇందుకోసం రూ. 1.25 కోట్లు వరకు మొత్తం ఫీజులు రీయింబర్స్‌ చేస్తున్నారన్నారు. అలాగే 1 నుంచి 10 తరగతి వరకు జగనన్న గోరుముద్ద అమలు చేస్తున్నారని.. పిల్లలకు నాణ్యమైన పౌష్టికాహారం అందిస్తున్నారన్నారు. ఇప్పటివరకూ గోరుముద్దకు రూ. 4,417 కోట్లు ఖర్చు చేశారని.. జగనన్న గోరుముద్ద కోసం ఏటా రూ. 1, 910 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. జగనన్న విద్యాకానుక కోసం ఇప్పటివరకూ రూ. 3, 367 కోట్లు ఖర్చు చేశారని.. విద్యాసంస్కరణల్లో డిజిటల్‌ లెర్నింగ్‌ కీలకమైనదన్నారు.


నాడు-నేడు ద్వారా ప్రభుత్వం ఆసుపత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తోందన్నారు. 53 ఏరియా ఆసుపత్రుల్లో, 9 జిల్లా ఆసుపత్రుల్లో వసతుల అభివృద్ధి.. 1142 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 177 కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు.. రాష్ట్ర వ్యాప్తంగా 10, 132 విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌లు ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 12 మంది పారా మెడికల్‌ సిబ్బందిని నియమించారని.. ఇప్పటివరకూ రూ. 1.32 కోట్లు రోగులకు అందించారన్నారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్‌ లక్ష్యం దిశగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం చేపడుతున్న విషయాన్ని ప్రసంగంలో ప్రస్తావించారు.


రైతులు రాష్ట్రానికి వెన్నెముక.. అందుకే వారి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేశారన్నారు 62 శాతం మంది వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నారని.. 10, 778 రైతు భరోసా కేంద్రాల ఏర్పాటు చేసి వారికి సేవలు అందిస్తున్నారన్నారు. ఇప్పటివరకూ 53. 53 లక్షల రైతులకు రైతు భరోసా ఇచ్చామని.. రైతు భరోసా కింద రూ. 33, 300 కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందిస్తున్నారని.. 22.85 లక్షల రైతులకు రూ. 1, 977 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇచ్చారన్నారు. మిచౌంగ్ తుఫాన్‌లో నష్టపోయిన రైతులకు రూ. 347.55 కోట్ల సాయం అందిస్తున్నారన్నారు.


రాష్ట్రంలో మత్స్య కార కుటుంబాలకు రూ. 540 కోట్లు అందించారని. చేపల వేటకు వెళ్లి మరణిస్తే నష్టపరిహారం రూ. 5లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచారని.. ఫిషింగ్‌ బోట్లకు డీజిల్‌ సబ్సిడీ కోసం రూ. 128.27 కోట్లు ఇచ్చారన్నారు. ఆక్వా రైతుల విద్యుత్‌ చార్జీల రాయితీ కోసం రూ. 3,186. 36 కోట్లు అందించారని.. రూ. 50.30 కోట్లతో 35 ఆక్వాల్యాబ్‌లు ఏర్పాటు చేశారన్నారు. ఈ ప్రభుత్వం మహిళా సాధికారత, శిశువుల ఆరోగ్యంపై ప్రత్యేక కృషి చేస్తోందన్నారు. ఏపీలో 55, 607 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం అందజేస్తోందన్నారు. వైఎస్సార్‌ ఆసరా ద్వారా మహిళా గ్రూపులకు ఆర్థిక సాయం.. 78.84 లక్షల మంది మహిలలకు నాలుగేళ్లలో రూ. 25, 571 కోట్లు అందజేసినట్లు తెలిపారు.

Latest News
Delhi: Four proclaimed offenders arrested for electricity-related offences Sat, May 02, 2026, 04:01 PM
Stain on humanity, words fail us to even express our condemnation: Athawale on Pune minor's rape-murder Sat, May 02, 2026, 03:59 PM
Ajmer Dargah-Shiv temple dispute: Heated arguments over impleadment; court reserves order Sat, May 02, 2026, 03:43 PM
Uttarakhand youth dies by suicide after levelling allegations against police, probe on Sat, May 02, 2026, 03:39 PM
Strict action should be taken against those responsible: Cong MP Tankha after meeting Jabalpur cruise tragedy victims Sat, May 02, 2026, 03:36 PM