శక్తి స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ,,,బెంగళూరులో కొనసాగుతున్న ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్ల బంద్
 

by Suryaa Desk | Mon, Sep 11, 2023, 10:21 PM

కర్ణాటక ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్ యూనియన్లు బంద్‌కు పిలుపునిచ్చాయి. దీంతో నేడు బెంగళూరులో ట్యాక్సీలు, క్యాబ్‌లు సహా కమర్షియల్ ప్రయివేట్ వాహనాలన్నీ సర్వీసులను నిలిపేశాయి. ఏకంగా 9 లక్షల ప్రయివేట్ వాహనాలు రోడ్డెక్కలేదు. ఆదివారం అర్ధరాత్రి మొదలైన బెంగళూరు బంద్.. సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగనుంది. బంద్ ప్రభావంతో.. నగరంలోని కొన్ని ప్రయివేట్ స్కూళ్లు సోమవారం సెలవు ప్రకటించాయి. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోన్న ‘శక్తి స్కీమ్’ను వ్యతిరేకిస్తూ.. ప్రయివేట్ వాహనాల యజమానులు బంద్‌కి పిలుపునిచ్చారు. ఈ పథకం అమలు కారణంగా తమ లాభాలకు గండి పడిందని ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్ ఆపరేటర్లు వాపోతున్నారు. శక్తి స్కీమ్‌లో భాగంగా కర్ణాటక వ్యాప్తంగా మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని సిద్ధరామయ్య సర్కారు కల్పిస్తోంది. నాన్ ప్రీమియం బస్సులన్నింటిలో మహిళలకు ఉచిత బస్సు సదుపాయం అమల్లో ఉంది. ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే వెసులుబాటు ఉండటంతో మహిళలెవరూ ఆటోలు, క్యాబ్‌లు ఎక్కడం లేదు. ఫలితంగా వారి ఆదాయానికి భారీగా గండిపడింది.


దీంతో తమకు ప్రతి నెలా రూ.10 వేల చొప్పున ఆర్థిక సాయం చేయాలని ఆటో రిక్షా యూనియన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి. డ్రైవర్ల డెవలప్‌‌మెంట్ కోసం ఓ అథారిటీని ఏర్పాటు చేయాలని.. అక్రమ బైక్ ట్యాక్సీలను నిషేధించాలని, ఎలక్ట్రిక్ ఆటోలకు అనుమతులు ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్ట్ ట్యాక్సీలకు ఒకే తరహా ఛార్జీల విధానం కావాలని ట్యాక్సీ యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. వ్యక్తిగత వాహనాలను వాణిజ్య ప్రయోజనాలకు వాడకుండా చర్యలు తీసుకోవాలని ట్యాక్సీ యూనియన్ డిమాండ్ చేస్తోంది. ప్రయివేట్ ట్రాన్స్‌పోర్ట్ బంద్ నేపథ్యంలో.. బెంగళూరు ఎయిర్‌పోర్ట్ ప్రయాణికులకు సూచనలు జారీ చేసింది. ఎయిర్‌పోర్ట్‌కు రాకపోకలు సాగించే ప్రయాణికులు బంద్‌ విషయాన్ని దృష్టిలో ఉంచుకోవాలని.. ట్యాక్సీలు నిలిపోయే అవకాశం ఉండటంతో తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించించింది.


బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు కూడా బంద్ నేపథ్యంలో ట్రాఫిక్ అడ్వైజరీని జారీ చేశారు. కేజీ రోడ్, శేషాద్రి రోడ్‌, జీటీ రోడ్‌తోపాటు ఫ్రీడమ్ పార్క్, మెజిస్టిక్ బస్టాండ్ పరిసరాల్లోని రోడ్ల మీదకు రావొద్దని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని ట్రాఫిక్ పోలీసులు ప్రజలకు సూచించారు. బంద్ కారణంగా ప్రజలకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉండటంతో.. అదనపు ఆర్టీసీ బస్సు సర్వీసులు అందుబాటులోకి తెచ్చారు. బీఎంటీసీ అదనంగా 500 బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెట్రో రైలు ఫ్రీక్వెన్సీని సైతం పెంచారు. బంద్ పిలుపు నేపథ్యంలో నగరంలోకి కొన్ని స్కూళ్లు, కాలేజీలు పరీక్షలను వాయిదా వేశాయి.

Latest News
Deaths after C-Sec complications in Kota: Doctor and two nursing staff suspended Sat, May 09, 2026, 04:12 PM
Bengal saved from turning to 'Western Bangladesh': Minister Agnimitra Paul Sat, May 09, 2026, 04:11 PM
'Akhilesh Yadav has become tourist these days': BJP's Shahnawaz Hussain targets SP chief over Bengal visit Sat, May 09, 2026, 04:10 PM
Lankan newspapers carry front-page tributes for Pahalgam terror attack victims, honour 'Op Sindoor' Sat, May 09, 2026, 04:08 PM
American passengers aboard hantavirus-hit cruise ship to quarantine in Nebraska Sat, May 09, 2026, 04:05 PM