విఐ ఆనంద్ దర్శకత్వంలో సందీప్ కిషన్ నటించిన 'ఊరు పేరు భైరవకోన' సినిమా బాక్సాఫీస్ వద్ద హిట్ గా నిలిచింది. వి ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2015 రొమాంటిక్ యాక్షన్ చిత్రం టైగర్ తర్వాత సందీప్ కిషన్తో అతని రెండవ సహకారం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ సినిమాలు ఛానల్ లో సెప్టెంబర్ 12న రాత్రి 9 గంటలకి వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది. ఈ చిత్రంలో వర్ష బొల్లమ్మ కథానాయికగా నటించింది. వెన్నెల కిషోర్, రవిశంకర్, హర్ష చెముడు మరియు కావ్య థాపర్ ఈ చిత్రంలో ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఎకె ఎంటర్టైన్మెంట్స్ సమర్పణలో హాస్య మూవీస్కు చెందిన రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మించారు. శేఖర్ చంద్ర ఈ సినిమాకి సంగీతం అందించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa