టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో తేజ సజ్జా రాబోయే పాన్-ఇండియా చిత్రం "మిరాయ్"తో మరోసారి ప్రేక్షకులను ఆకర్షించడానికి సిద్ధంగా ఉన్నాడు. సెప్టెంబర్ 12, 2025న 8 భాషల్లో గ్రాండ్గా విడుదల కానుంది. ఈ సినిమా యాక్షన్ సినిమా ఔత్సాహికులు మరియు సాధారణ వీక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ సినిమా యొక్క ఓవర్సీస్ రైట్స్ ని శ్లోక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ సొంతం చేసుకుంది. ఈ సినిమా యొక్క నార్త్ అమెరికా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా నార్త్ అమెరికా ప్రీ సేల్స్ $200K మార్క్ కి చేరుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. మంచు మనోజ్ ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రితిక నాయక్ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. జగపతి బాబు, జయ రామ్, శ్రియ శరన్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రంకి కార్తీక్ ఘట్టమ్నేని సినిమాటోగ్రఫీ మరియు స్క్రీన్ప్లే రెండింటినీ నిర్వహిస్తున్నారు. ఈ సినిమాకి మణిబాబు కరణం డైలాగ్స్ రాశారు. గౌర హరి సంగీతాన్ని అందించగా, శ్రీ నాగేంద్ర తంగల కళా దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa