ప్రముఖ నటుడు అథర్వా మురళి రాబోయే యాక్షన్-ప్యాక్డ్ థ్రిల్లర్ 'టన్నెల్' తో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. రవీంద్ర మాధవ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో లావన్య త్రిపాఠీ మహిళా ప్రధాన పాత్రలో నటిస్తుంది. అశ్విన్ కకుమను ఈ సినిమాలో విలన్ పాత్రలో నటిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకొని 'U/A' సర్టిఫికెట్ పొందినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం, శక్తి సారావనన్ సినిమాటోగ్రాఫర్, మరియు కలైవనన్ ఎడిటర్ గా ఉన్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానుంది. తెలుగు వెర్షన్ రాజు నాయక్ లాచురం ప్రొడక్షన్స్ ద్వారా విడుదల అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa