కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో టాలీవుడ్ యువ నటుడు తేజా సజ్జా తన తదుపరి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'మిరాయి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్-ఇండియా యాక్షన్-అడ్వెంచర్ చిత్రం తేజా సజ్జాని సూపర్ యోధా పాత్రలో చూపించనుంది. ఈ చిత్రం సెప్టెంబర్ 5న 2డి మరియు 3డి ఫార్మాట్లలో 8 వేర్వేరు భాషలలో ప్రపంచవ్యాప్తంగా గొప్ప విడుదల కానున్నట్లు మేకర్స్ గతంలో ప్రకటించారు. తాజగా ఇప్పుడు ఈ చిత్రం సెప్టెంబర్ 12న విడుదల కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. రానున్న రోజులలో ఈ విషయం పై మేకర్స్ క్లారిటీ ఇవ్వనున్నారు. రాకింగ్ స్టార్ మనోజ్ మంచు విలన్ పాత్రలో నటిస్తున్నారు. రితికా నాయక్ ప్రముఖ మహిళ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమని టిజి విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa