ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కన్యా కుమారి' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్స్ గా వస్తుంది ఎవరంటే...!

cinema |  Suryaa Desk  | Published : Wed, Aug 20, 2025, 09:09 AM

ప్రముఖ నటి మధు షాలిని 'కన్యా కుమారి' అనే టైటిల్ తో కొత్త చిత్రాన్ని ప్రకటించింది. ఈ సినిమాని శ్రీజన్ అటాడా రూపొందించారు మరియు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో గీత సైని మరియు శ్రీ చరణ్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ మరియు ఫస్ట్ సింగల్ కి భారీ స్పందన లభించింది. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ మరియు ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ని ఆగష్టు 20న సాయంత్రం 4 గంటలకి హైదరాబాద్ లోని AAA సినిమాస్ లో నిర్వహిస్తున్నట్లు మేకర్స్ వెల్లడించారు. తాజాగా ఇప్పుడు ఈ ఈవెంట్ కి బన్నీ వాస్, సిద్ధూ జొన్నలగడ్డ, భాను భోగవరపు ముఖ్య అతిధులుగా హాజరుకానున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రం విడుదల ఆగస్టు 27 న విడుదల కానుంది. ఈ చిత్రానికి రవి నిదామార్తి సౌండ్‌ట్రాక్‌ను అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని రాడికల్ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa