ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రామాయణ' కి వాయిస్ ఓవర్ అందిస్తున్న బాలీవుడ్ బిగ్ బి

cinema |  Suryaa Desk  | Published : Tue, Aug 19, 2025, 05:28 PM

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ తన తదుపరి చిత్రాన్ని నితేష్ తివారీ దర్శకత్వంలో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మేకర్స్ 'రామాయణ' అనే టైటిల్ ని లాక్ చేసారు. రణబీర్ కపూర్ లార్డ్ రామ్ గా, సాయి పల్లవి సీతా దేవతగా మరియు యష్ రావణ్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇటీవలి రిపోర్ట్స్ ప్రకారం, బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ సినిమాలో జాటాయు పాత్రకు మరియు సినిమాకి కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నట్లు సమాచారం. యష్ ఈ చిత్రంలో నటించడమే కాక, ప్రైమ్ ఫోకస్ స్టూడియోలతో పాటు తన బ్యానర్ మాన్స్టర్ మైండ్ క్రియేషన్స్ కింద చిత్రాన్ని సహ-నిర్మించాడు. లక్ష్మణ్‌గా రవి దూబే, కైకేయిగా లారా దత్తా, శూర్పణఖగా రకుల్ ప్రీత్ సింగ్, హనుమాన్ గా సన్నీ డియోల్  మరియు దశరథ్‌గా అరుణ్ గోవిల్ నటిస్తున్నారు. రామాయణం యొక్క మొదటి భాగం 2026 దీపావళికి విడుదల అవుతుంది, దాని తర్వాత రెండవ భాగం 2027 దీపావళికి విడుదల అవుతుంది. ఈ చిత్రానికి సంగీతాన్ని AR రెహ్మాన్ మరియు హన్స్ జిమ్మెర్ స్వరపరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa