టాలీవుడ్ యువ నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఇటీవలే తన కొత్త ప్రాజెక్ట్ ని "చావు కబురు చాలగా" అనే హిట్ చిత్రానికి పేరుగాంచిన కౌశిక్ పెగళ్లపాటితో ప్రకటించారు. ఈ చిత్రానికి 'కిష్కీందపురి' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా టీజర్ మూవీ పై భారీ హైప్ ని సృష్టించింది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా యొక్క శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ ఎంటర్టైన్మెంట్ ఛానల్ జీ తెలుగు సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ చిత్రం సెప్టెంబర్ 12, 2025న విడుదల కానుంది. ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన కథానాయికగా అనుపమ పరమేశ్వరన్ కనిపించనుంది. శ్రీమతి షైన్ స్క్రీన్స్ బ్యానర్లో ప్రొడక్షన్ నెం. 8ని అర్చన సమర్పిస్తున్నారు. చిన్మయ్ సలాస్కర్ కెమెరా క్రాంక్ చేయనుండగా, మనీషా ఎ దత్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, డి శివ కామేష్ ఆర్ట్ డైరెక్టర్ గా ఉన్నారు. నిరంజన్ దేవరమానే ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు. చైతన్ భరత్త్వాజ్ ఈ సినిమాకి సంగీతాన్ని కంపోజ్ చేస్తున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గరిపాటి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa