ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైవాహిక జీవితంపై స్పందించిన శిల్పా శిరోద్కర్

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 04:47 PM

బాలీవుడ్ అందాల తార శిల్పా శిరోద్కర్ తన వ్యక్తిగత జీవితం గురించి ఇటీవల ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. శిల్పా శిరోద్కర్ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు వదిన అని తెలిసిందే. మహేశ్ అర్ధాంగి నమ్రతా శిరోద్కర్ కు శిల్పా స్వయంగా అక్క. ఆమె ప్రముఖ బ్యాంకర్ అపరేశ్ రంజిత్ ను వివాహం చేసుకున్నారు.తాజాగా తన వైవాహిక జీవితంపై శిల్పా శిరోద్కర్ ఆసక్తికర అంశాలు వెల్లడించారు. తాను పదో తరగతి కూడా పాస్ కాలేదని, కానీ తన భర్త అపరేశ్ రంజిత్ మాత్రం డబుల్ ఎంబీఏ చేసిన బ్యాంకర్ అని ఆమె వెల్లడించారు. ఈ విద్యాపరమైన వ్యత్యాసం తమ బంధాన్ని ఏనాడూ ప్రభావితం చేయలేదని శిల్పా స్పష్టం చేశారు. "నేను టెన్త్ ఫెయిల్. నా భర్త బ్యాంకర్, డబుల్ ఎంబీఏ. మేమిద్దరం చాలా భిన్నమైన వ్యక్తులం. కానీ అతనితో, అతని స్నేహితులతో నేను ఎలాంటి విషయాల గురించైనా మాట్లాడగలను. తక్కువ చదువుకున్నానని, అతని ముందు నేను ఎప్పుడూ చిన్నబుచ్చుకోలేదు" అని శిల్పా అన్నారు. తామిద్దరి మధ్య ఉన్న పరస్పర గౌరవం, అవగాహన తమ బంధానికి పునాది అని ఆమె స్పష్టం చేశారు.ఇటీవల ఈ దంపతులు తమ 25వ వివాహ వార్షికోత్సవాన్ని జరుపుకున్నారు. తన భర్తకు ప్రత్యేకంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ శిల్పా తన ప్రేమను, గౌరవాన్ని చాటుకున్నారు. 13 ఏళ్ల విరామం తర్వాత శిల్పా శిరోద్కర్ 2013లో జీ టీవీ సీరియల్ 'ఏక్ ముఠీ ఆస్మాన్'తో మళ్లీ నటనా రంగంలోకి ప్రవేశించారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa