ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'విశ్వంభర' గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వశిష్ఠ

cinema |  Suryaa Desk  | Published : Wed, Jul 23, 2025, 01:10 PM

చిరంజీవి కథానాయకుడిగా 'విశ్వంభర' రూపొందుతోంది. ఈ సినిమాకి వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్నారు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మితమవుతోంది. ఈ నేపథ్యంలో అయన  ఈ సినిమాను గురించి మాట్లాడారు. 'బింబిసార' తరువాత నేను 'బింబిసార 2' చేయవలసి ఉంది. కానీ ఆ ప్రాజెక్టు వేరేవాళ్లు చేస్తేనే బాగుంటుందని భావించి నేను బయటికి వచ్చేశాను"అని అన్నారు. " అంతకుముందే నేను రజనీకాంత్ గారి కోసం ఒక కథను సిద్ధం చేసుకున్నాను. ఆయనకి వినిపించాలని అనుకున్నాను. ఆ కథ నచ్చడంతో దిల్ రాజుగారు అందుకు సంబంధించిన ఏర్పాట్లు చకచకా చేసేశారు. రజనీకాంత్ గారికి కథ చెప్పాను .. ఆయనకి నచ్చింది కూడా. కాకపోతే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. అలాంటి పరిస్థితులలోనే చిరంజీవిగారికి కథని వినిపించే ఛాన్స్ వచ్చింది" అని చెప్పారు. " నేను ఎంతగానో అభిమానించే మెగాస్టార్ ముందు కూర్చున్నాను అనే ఆలోచనే నన్ను ఉక్కిరిబిక్కిరి చేసింది. బెరుకుగా .. భయంగా మాత్రం అనిపించలేదు. ఎందుకంటే చిరంజీవిగారు ఆ ఫ్రీడమ్ ఇస్తారు. అలాగని చెప్పి చిరంజీవిగారి కళ్లలోకి చూస్తూ కథ చెప్పడం కూడా అంత తేలికైన విషయమేం కాదు. కథ విన్న తరువాత తన నిర్ణయాన్ని చెప్పడానికి ఆయన ఎక్కువ సమయం తీసుకోరు. ఈ సినిమా చేస్తున్నామని చెప్పగానే, ఆ ఆశ్చర్యం నుంచి తేరుకోవడానికి నాకు చాలా సమయం పట్టింది" అని అన్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa