ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కింగ్డమ్' గుంటూరు థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Jul 18, 2025, 03:55 PM

జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్నురి దర్శకత్వంలో టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ 'కింగ్డమ్' అనే చిత్రంతో ప్రేక్షకులని అలరించటానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పాన్-ఇండియన్ చిత్రం పై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రానికి కథ కూడా గౌతమ్ రాసుకున్నారు. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క గుంటూరు థియేటర్ రైట్స్ ని రాధా కృష్ణ ఎంటెర్టైన్మ్నెట్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో భగ్యాశ్రీ బోర్స్ మహిళా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ చిత్రంలో నవ్య స్వామి, సత్య దేవ్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. ఈ చిత్రంలో విజయ్ స్పై ఏజెంట్‌గా కనిపించనున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అనిరుద్ రవిచందర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం జులై 31న గ్రాండ్ విడుదలకి సిద్ధంగా ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa