హను రాఘవపుడి దర్శకత్వం వహించిన రొమాంటిక్ డ్రామా 'అందాల రాక్షసి' ఈ ఏడాది విడుదలైన 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్ర నిర్మాతలు జూన్ 13న ఈ సినిమాని రీ రిలీజ్ చేసారు. నవీన్ చంద్ర, లావణ్య త్రిపాఠి మరియు రాహుల్ రవీంద్రన్ ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా విడుదలైన తొలి రోజున వరల్డ్ వైడ్ గా 1.12 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. తాజాగా ఇప్పుడు మూవీ మేకర్స్ ఈ సినిమా భారీ స్పందన కారణంగా అన్ని చోట్ల నార్త్ ఇండియా మరియు తమిళనాడులో కూడా ఎక్స్ట్రా షోస్ ని జోడించినట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ సినిమాని సాయి కొర్రాపతి, ఎస్ఎస్ రాజమౌలి కలిసి నిర్మించారు. రాధన్ సంగీతాన్ని కంపోజ్ చేయగా, మురళి జి సినిమాటోగ్రాఫర్గా పనిచేశారు. ఈ సినిమాలో నరసింహ రావు, ప్రగతి, మురళి కృష్ణ మరియు ఇతరులు కీలక పాత్రలలో నటించారు. ఈ చిత్రాన్ని నైజాం రీజియన్ లో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP బ్యానర్ విడుదల చేసింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa