కలర్ ఫోటోకు పేరుగాంచిన యువ దర్శకుడు సందీప్ రాజ్ తన తాజా చిత్రం 'మోగ్లీ 2025' తో తిరిగి వచ్చాడు. బబుల్ గమ్ ఫేమ్ రోషన్ కనకాలా ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ఇప్పటికే బజ్ ని క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా షూటింగ్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాకి సంబందించిన యాక్షన్ షెడ్యూల్ ని ప్రారంభించినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు ప్రొడక్షన్ హౌస్ షూటింగ్ సెట్స్ నుండి ఒక వీడియోని పోస్ట్ చేసింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ క్రింద టిజి విశ్వ ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో సాక్షి మడోల్కర్ మహిళా ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమాలో బండి సరోజ్, హర్ష కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కాలభైరవ సంగీత దర్శకుడు. రామమూర్తి, పవన్ కళ్యాణ్ సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ విభాగాలను నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం షూట్ జరుగుతోంది విడుదల తేదీ త్వరలో ప్రకటించబడుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa