ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'మైసూరు శాండల్' సబ్బు ప్రచారకర్తగా తమన్నా

cinema |  Suryaa Desk  | Published : Fri, May 23, 2025, 06:42 PM

ప్రఖ్యాత 'మైసూరు శాండల్' సబ్బుల తయారీ సంస్థ, కర్ణాటక ప్రభుత్వ ఆధీనంలోని కర్ణాటక సోప్స్ అండ్ డిటర్జెంట్స్ లిమిటెడ్ (కేఎస్‌డీఎల్), తమ మార్కెట్‌ను మరింత విస్తరించుకునే లక్ష్యంతో నటి తమన్నాతో భారీ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సబ్బుల ప్రచారకర్తగా వ్యవహరించేందుకు తమన్నాతో రూ.6.2 కోట్ల విలువైన కాంట్రాక్టుపై సంతకాలు చేసింది. అయితే, కన్నడ నటీమణులను కాదని తమన్నాను ఎంచుకోవడంపై సామాజిక మాధ్యమంలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.రాష్ట్ర ఆర్థిక శాఖ బుధవారం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, తమన్నాతో కుదిరిన ఈ ఒప్పందం రెండేళ్ల రెండు రోజుల పాటు అమలులో ఉంటుంది. ఈ ఒప్పందం కోసం కర్ణాటక పబ్లిక్ ప్రొక్యూర్‌మెంట్ పారదర్శకత చట్టం (కేటీపీపీ) సెక్షన్ 4(జి) కింద కేఎస్‌డీఎల్‌కు మినహాయింపు కూడా ఇచ్చారు. దీని ద్వారా నటికి రూ.6.2 కోట్లను నేరుగా చెల్లించేందుకు వీలు కల్పించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com