క్రిష్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా చిత్రీకరణ ఆగిపోయిందంటూ కొన్ని రోజులుగా మీడియాలో వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ చిత్ర నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ కీలకమైన అప్డేట్ను ఇచ్చింది. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న విడుదల చేస్తున్నట్లు సోమవారం సోషల్ మీడియాలో ప్రకటించింది. త్వరలో ప్రోమోను కూడా విడుదల చేస్తున్నట్లు అందులో తెలిపారు. అసత్యాలు నమ్మవద్దు, భారీ హంగులు, అత్యున్నత ప్రమాణాలతో సినిమాను తీర్చిదిద్దాలనే ప్రయత్నం వల్ల చిత్రీకరణకు ఎక్కువ సమయం పడుతోంది అని మేకర్స్ పేర్కొన్నారు. ఇందులో పవన్కు జోడీగా నిధి అగర్వాల్ నటిస్తున్నారు. ఏఎం రత్నం సమర్పణలో ఏ. దయాకర్రావు నిర్మిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa