బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, వివాదస్పద నాయిక పూనమ్ పాండే మరణించిందనే వార్త ఎంతగా సంచలనం సృష్టించిందో తెలిసిందే! గర్భాశయ క్యాన్సర్ అవగాహన పేరుతో ఆమె ఇచ్చిన షాక్ నుంచి కొందరు ఇప్పటికీ తేరుకోలేదు. కొందరైతే అవగాహన కోసం ఇలాంటి ప్రచారమా? అని మండిపడుతున్నారు. అయితే తాజాగా ఈ విషయంపై ఆమె భర్త సామ్ బాంబే స్పందించారు. ఆమె మరణవార్త విన్నాక తనకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదన్నారు. ఇలాంటిదేమీ జరిగి ఉండదని భావించినట్లు ఆయన వెల్లడించారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సామ్ మాట్లాడుతూ ‘‘ఈ వార్త విన్నప్పుడు నా హృదయంలో ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. దాని వల్ల ఎలాంటి నష్టం అనిపించలేదు. ఆమె మరణించిందనేది నేను నమ్మలేదు. ఎందుకంటే ఎవరితోనైనా మీరు కనెక్ట్ అయి ఉంటే ప్రతి విషయంలో ఎక్కువగా ఫీలవుతారు. నేను ప్రతిరోజూ ఆమె గురించి ఆలోచిస్తా. అంతే కాదు ఆమె కోసం ప్రార్థిస్తాను కూడా. ఏదైనా తప్పు జరిగితే కచ్చితంగా నా మనసుకు తెలిసిపోతుంది. ఆమె ఇంకా బతికే ఉన్నందుకు సంతోషంగా ఉంది’’ అని అన్నారు. అంతే కాకుండా ఆమె ధైర్యవంతురాలైన భారతీయ మహిళ అని సామ్ బాంబే ప్రశంసించారు. ఎవరైనా తమ కీర్తి, ప్రతిష్టను పూర్తిగా విస్మరించి ఒక సమస్యపై అవగాహన పెంచుకుంటే ప్రజలు గౌరవించాలని ఆయన సూచించారు. 2020లో పూనమ్, సామ్ వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహబంధం ఎక్కువ రోజులు కొనసాగలేదు. హనీమూన్ తర్వాత భర్త పలు రకాలుగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో సామ్ను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa