ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫిబ్రవరి 15న విడుదల కానున్న '‘భ్రమయుగం'

cinema |  Suryaa Desk  | Published : Mon, Jan 29, 2024, 04:52 PM

'కాదల్‌ ది కోర్‌' సక్సెస్‌ మలయాళ స్టార్‌ మమ్ముటీ  విభిన్న పాత్ర పోషించిన చిత్రం  '‘భ్రమయుగం'. హారర్‌ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని రాహుల్‌ సదాశివన్‌ తెరకెక్కిస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ఈ సినిమా టీజర్‌, పోస్టర్స్‌కి ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. తాజాగా ఈ సినిమాను ఫిబ్రవరి 15న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. నైట్‌ షిఫ్ట్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై చక్రవర్తి రామచంద్ర, శశికాంత్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని  మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు. చిత్ర మలయాళ వెర్షన్‌ ఓవర్సీస్‌ థియేట్రికల్‌ డిస్ర్టిబ్యూటర్‌ ‘ట్రూత్‌ గ్లోబల్‌ ఫిల్మ్స్‌’ కాగా, చిత్ర కేరళ థియేట్రికల్‌ డిస్ర్టిబ్యూటర్‌ మిస్టర్‌ ఆంటో జోసెఫ్‌ యొక్క ఎఎఎన్  మెగా మీచి?యా’’. ఈ నెల  26 డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో సీ్ట్రమింగ్‌ చేసిన సౌండ్‌ ట్రాక్‌తో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ గా షెహనాద్‌ జలాల్‌, ప్రొడక్షన్‌ డిజైనర్‌గా జోతిష్‌ శంకర్‌, ఎడిటర్‌గా షఫీక్‌ మహమ్మద్‌ అలీ, సంగీత దర్శకుడిగా క్రిస్టో జేవియర్‌ పని చేస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa