ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'రైతు బిడ్డ' ప్రశాంత్ కు హరీష్ రావు అభినందనలు

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 18, 2023, 12:24 PM

బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ పల్లవి ప్రశాంత్ కు మాజీ మంత్రి హరీశ్ రావు అభినందనలు తెలిపారు. సిద్దిపేటకు చెందిన 'రైతు బిడ్డ' విజేతగా నిలిచినందుకు సంతోషంగా ఉందన్నారు. పొలాల నుంచి బిగ్ బాస్ హౌస్ వరకు అతని ప్రయాణం ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుందన్నారు. ఈ సీజన్ లో రైతుగా బరిలోకి దిగిన ప్రశాంత్ సామాన్యుల దృఢ సంకల్పానికి ప్రతీకగా నిలిచారని కొనియాడుతూ హరీశ్ రావు ఎక్స్ లో ట్వీట్ చేశారు.
పల్లవి ప్రశాంత్‌.. బిగ్‌బాస్‌ షోకు రావడానికి ముందు సోషల్‌ మీడియా ఉపయోగించే కొద్దిమందికే తెలుసు. కానీ బిగ్‌బాస్‌ 7లోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. మూడు నెలలకు పైగా తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉర్రూతలూగించిన బిగ్ బాస్ సీజన్-7 టైటిల్ ను 'రైతు బిడ్డ' పల్లవి ప్రశాంత్ కైవసం చేసుకున్నాడు. ఎంతో ఉత్సాహభరితంగా సాగిన గ్రాండ్ ఫినాలే చివర్లో బిగ్ బాస్ ఇంట్లో మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లు పల్లవి ప్రశాంత్, అమర్ దీప్ చౌదరిలను హోస్ట్ నాగార్జున స్టేజిపైకి తీసుకువచ్చారు. అనంతరం.. పల్లవి ప్రశాంత్ విజేత అంటూ అనౌన్స్ చేశారు. అమర్ దీప్ చౌదరిని రన్నరప్ గా ప్రకటించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa