బాలీవుడ్లో మరో ఆసక్తికర కాంబినేషన్ కు తెర లేచింది. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ సన్నీ డియోల్ ఈ చిత్రం చేయునున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై త్వరలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. టాలీవుడ్ భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఇటీవలే గోపీచంద్ వ్రాసిన స్టోరీని సన్నిడియోల్ కు వివరించగా ఆయన బాగా ఇంప్రెస్ అవడంతో చర్చలు ప్రారంభించినట్లు సమాచారం. ఈ సంవత్సరం ప్రధమార్థంలో బాలకృష్ణ హీరోగా వచ్చిన వీరసింహరెడ్డి సినిమాకు దర్శకత్వం వహించిన గోపీచంద్ మలినేని డైరెక్ట్ చేయనున్నారు.ఇప్పటికే అట్లీ, సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేసి అంతకుముందు హిందీ ఇండస్ట్రీ చూడని విజయాలను నమోదు చేసి సరికొత్త రికార్డులు నమోదు చేశారు. తాజాగా ఇప్పుడు మరో సౌత్ డైరెక్టర్ బాలీవుడ్ కు వెళ్లడం సర్వత్రా టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.అయితే ఇటీవలే గోపిచంద్ మలినేని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో రవితేజ, తమన్ కాంబినేషనల్లో ఓ కొత్త ప్రాజెక్ట్ ను ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ మధ్య రవితేజకు రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాల వంటి వరుస పరాజయాలు ఎదురవడంతో నిర్మాతలు ప్రస్తుతానికి ఆ ప్రాజెక్టును పక్కన పెట్టి ఈ కొత్త బాలీవుడ్ సినిమాను తెరమీదకు తీసుకువచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇటీవలే సన్నీడియోల్ గదర్ 2 సినిమాతో భారీ బ్లాక్బస్టర్ హిట్ సాధించడమే గాక చిత్రం రూ. 650 కోట్లు కటెక్షన్లు సాధించింది. అదేవిధంగా సన్నీడియోల్ సోదరుడైన బాబీ డియోల్ రీసెంట్గా యానిమల్ సినిమాలో ప్రతినాయకుడిగా(అబరార్) నటించి తెలుగు వారికి కూడా దగ్గరవడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa