'కానా’ ఫేం దర్శన్, ‘హృదయం’ ఫేం దర్శన రాజేంద్రన్ జంటగా కొత్త చిత్రం తెరకెక్కనుంది. ‘సినిమాక్కారన్’ ఫేం వి.వినోద్ కుమార్ సమర్పణలో ‘సేత్తుమాన్’ ఫేం తమిళ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల తమిళ చిత్ర పరిశ్రమలో అనేక నవలలు దృశ్య కావ్యాలుగా తెరకెక్కుతూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ కోవకు చెందిన చిత్రం ‘ముల్లుం మలరుమ్’ కూడా. ఇపుడు అలాంటి ఒక మంచి నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుంది. ప్రఖ్యాత నవలా రచయిత పెరుమాళ్ మురుగన్ ఈ కథను సమకూర్చడమే కాకుండా, మాటలను అందిస్తున్నారు. ‘సేత్తుమాన్’ చిత్రంతో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న తమిళ్.. ఇపుడు మరో అద్భుతమైన కథతో ప్రేక్షకులను అలరించేందుకు ముందుకువస్తున్నారు. తమిళ్ మాట్లాడుతూ... మంచి కంటెంట్ ఉన్న చిత్రాలను ప్రేక్షకులు ఆదరించడమే కాకుండా.. ఆ చిత్రాల్లో పనిచేసిన నటీనటులను, టెక్నీషియన్లను ప్రోత్సహిస్తారు. పైగా ప్రేక్షకులకు మంచి కథతో కూడిన సినిమాను అందించాలన్న తపన కలిగిన నిర్మాత ఎస్.వినోద్ కుమార్తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. ఈ డ్రీం ప్రాజెక్టును రూపొందించడం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. ఈ సినిమా షూటింగ్ను శుక్రవారం నుంచి ప్రారంభించాం. నటీనటుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa