ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భవిష్యత్తులో మరోసారి ఆయనతో అవకాశం వస్తుందని ఆశిస్తున్నా

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2023, 01:05 PM

రణ్‌బీర్‌ కపూర్‌, రష్మిక మందన్నా జంటగా నటించిన యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘యానిమల్‌’. సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో త్రిప్తి డిమ్రి.. జోయా అనే పాత్ర పోషించారు. ఆమె కనిపించింది కొద్ది సమయమే అయినప్పటికీ ఆమె నటనకు ప్రేక్షకులకు ఫిదా అయ్యారు. రణ్‌బీర్‌ - త్రిప్తి మధ్య సన్నివేశాలు నెట్టింట విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.త్రిప్తి మాట్లాడుతూ ‘‘రణ్‌బీర్‌ కపూర్‌తో వర్క్‌ చేయడం అద్భుతంగా ఉంది. ఆయన గొప్ప నటుడు మాత్రమే కాదు.. మంచి మనసు ఉన్న వ్యక్తి. యానిమల్‌’లో మా కెమిస్ర్టీకి ప్రేక్షకుల నుంచి చక్కని స్పందన వస్తోంది. భవిష్యత్తులో మేము మరోసారి కలిసి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నా’’ అని త్రిప్తి డిమ్రి అన్నారు.భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం నిడివి ఎక్కువ, వయలెన్స ఎక్కువ అనే కారణాలతో కాస్త నెగటివ్‌ టాక్‌ తెచ్చుకున్నప్పటికీ బాక్సాఫీస్‌ దగ్గర మాత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. మూడు రోజుల్లో సుమారుగా రూ.226 కోట్లు వసూలు చేసినట్లు ట్రేడ్‌ వర్గాలు చెబుతున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa