ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మైసూర్ చాముండేశ్వరి అమ్మవారి సన్నిధిలో రామ్ చరణ్

cinema |  Suryaa Desk  | Published : Mon, Dec 04, 2023, 12:06 PM

గ్లోబల్ స్టార్‌ రామ్‌ చరణ్‌ మైసూర్‌లోని చాముండేశ్వరి అమ్మవారి సన్నిధికి చేరుకున్నాడు. సోమవారం ఉదయం ఆలయానికి వెళ్లిన చరణ్‌ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, ప్రస్తుతం రామ్ చరణ్ మైసూర్‌లో జరుగుతున్న ‘గేమ్‌ ఛేంజర్‌’లో చిత్ర షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ సినిమాకి శంకర్‌ దర్శకత్వం వహిస్తుండగా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌ రాజు నిర్మిస్తున్నారు.
రామ్ చరణ్ తాజా సినిమా ‘గేమ్ ఛేంజర్’  సినిమా షూటింగ్ కోసం మైసూర్ లో బస చేశారు. చిత్రబృందంతో కలిసి వచ్చి దేవుడి దర్శనం చేసుకున్నారు. ప్రస్తుతం రామ్ చరణ్ అమ్మవారి ఆలయంలోకి వెళ్లిన వీడియో వైర‌ల్‌గా మారింది. ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమా షూటింగ్ మైసూర్‌లో జరుగుతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa