డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్తో సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. ఈ సినిమాకి 'యానిమల్' అనే టైటిల్ ని మేకర్స్ లాక్ చేసారు. నవంబర్ 27న ఈ సినిమా యొక్క ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లోని మల్లారెడ్డి యూనివర్సిటీలో సాయంత్రం 5 గంటల నుంచి జరగనుంది. తాజాగా ఇప్పుడు ఈ వేడుకకు మాస్టర్ స్టోరీ టెల్లర్ రాజమౌళి ముఖ్య అతిధిగా హాజరు కానున్నట్లు సమచారం. రాజమౌళి గతంలో బ్రహ్మాస్త్రాన్ని ప్రమోట్ చేశాడు మరియు అతను రణబీర్తో మంచి అనుబంధాన్ని పంచుకున్నాడు.
ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రష్మిక రణబీర్తో రొమాన్స్ చేయనుంది. యానిమల్ డిసెంబర్ 1, 2023న హిందీ, తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా విడుదల కానుంది. రణబీర్ కపూర్ ఈ సినిమాలో ఇంటెన్సివ్ క్యారెక్టర్లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్ కుమార్, టి-సిరీస్, భద్రకాళి పిక్చర్స్ అండ్ సినీ1 స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa