శైలేష్ కొలను దర్శకత్వంలో టాలీవుడ్ హీరో వెంకటేష్ తన 75వ సినిమాని అధికారికంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి 'సైంధవ్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలోని మొదటి సింగిల్ రాంగ్ యూసేజ్ని హైదరాబాద్లో విడుదల చేసారు. నకాష్ అజీజ్ ఈ పాటను ఆకట్టుకునే రీతిలో తీర్చిదిద్దారు. డబ్బు, మొబైల్ ఫోన్లు వంటి వాటిని తప్పుడు పద్ధతిలో ఉపయోగించవద్దని వెంకటేష్ ఈ పాటా ద్వారా తెలియజేసారు. చంద్రబోస్ రాసిన సాహిత్యం అర్థవంతంగా ఉంది.
యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తుంది. ఈ పాన్-ఇండియన్ ప్రాజెక్ట్ లో బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిక్, రుహాని శర్మ ముఖ్యమైన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13, 2024న థియేటర్లలో విడుదల కానుంది. ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ ని నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్నారు. ఈ పాన్ ఇండియన్ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa