ఎస్.ఎస్.ఎం.జి ప్రొడక్షన్స్ పతాకంపై ముఖేష్ గౌడ, ప్రియాంక శర్మ జంటగా నూతన దర్శకుడు రుద్ర దర్శకత్వంలో బిజినెస్ మ్యాన్ కె. దేవానంద్ నిర్మిస్తున్న ప్రేమకథా దృశ్యకావ్యం ‘గీతా శంకరం’. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్ర ఫస్ట్లుక్ను దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని శుక్రవారం సంస్థ కార్యాలయంలో మేకర్స్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్మాత దేవానంద్ మాట్లాడుతూ.. మా ఇష్టదైవమైన శ్రీ సెల్వమహాగణపతి పేరుపై ఆయన దీవెనలతో స్థాపించిన మా ఎస్.ఎస్.ఎం.జి సంస్థ పేరు మీద ప్రారంభించిన ప్రతి పని విజయవంతంగా పూర్తి చేశాము. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి అడుగుపెడుతున్నాము. ఇక్కడ కూడా తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది. ఇదొక మంచి ప్రేమకథా దృశ్యకావ్యం. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. ఈనెల 14 నుంచి కొత్త షెడ్యూల్ మొదలవుతుంది. సినిమా తీయాలని నిర్ణయించుకోగానే దాదాపుగా 20 మంది కథలు చెప్పారు. కానీ దర్శకుడు రుద్ర చెప్పిన పాయింట్ నాకు బాగా నచ్చి, సినిమా ప్రారంభించాం. అన్ని వర్గాలను ఆకట్టుకునే అంశాలతో ప్రేక్షకులను అలరిస్తుందని కాన్ఫిడెంట్గా చెప్పగలను. ఇందుకోసం యూనిట్ అందరూ కష్టపడి పని చేస్తుండడం చాలా హ్యాపీగా ఉందని అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa