కృతి సనన్ ఎలాంటి క్రేజీ చిత్రంలో నటించినా ఆమెకి సక్సెస్ ఆమడ దూరంలో ఉంటోంది. చివరగా టైగర్ ష్రాఫ్ సరసన నటించిన గణపథ్ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా నిలిచింది. మెరుపు తీగలాంటి నాజూకు బ్యూటీ కృతి సనన్. మహేష్ బాబు 1 నేనొక్కడినే చిత్రంతో కృతి సనన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ చిత్రం నిరాశ పరచడం కృతికి మైనస్ గా మారింది. ఇప్పుడు కృతి సనన్ బాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ఆ తర్వాత నాగ చైతన్యకు జోడిగా నటించిన దోచేయ్ చిత్రం కూడా నిరాశపరచడంతో కృతి సనన్ బాలీవుడ్ బాట పట్టింది. ఈ నిర్ణయం ఆమెకు మంచి ఫలితాన్ని ఇచ్చింది. బాలీవుడ్ లో వరుస సక్సెస్ లు రావడంతో క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది. ప్రస్తుతం కృతి సనన్ బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరు. రీసెంట్ గా కృతి సనన్ కి బిగ్ షాక్ తగిలింది. ప్రభాస్ కి జోడిగా నటించిన ఆదిపురుష్ చిత్రం మిక్స్డ్ టాక్ తో రన్ అవుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు దేశం నలువైపుల నుంచి ఆదిపురుష్ చిత్రాన్ని వివాదాలు చుట్టుముట్టాయి. ఈ చిత్రంలో కృతి సనన్ సీతాదేవి పాత్రలో నటించి మెప్పించింది. ఆమె పాత్రకి సంబంధించి ఎలాంటి సమస్య లేదు. ఇతర పాత్రల్లో దర్శకుడు ఓం రౌత్ వాడిన కాస్ట్యూమ్స్ గ్రాఫిక్స్, డైలాగ్స్ పై వివాదాలు చెలరేగాయి. తాజాగా కృతి సనన్ తళుకుబెళుకుల బ్లూ శారీలో అదరహో అనిపించే ఫోజులు ఇచ్చింది. కళ్ళు చెదిరే అందాలు రివీల్ చేస్తూ ఆమె ధరించిన బ్లౌజ్ ఇంకా హీటు పెంచేస్తోంది. నడుముని మెలికలు తిప్పుతూ వయ్యారంగా కృతి ఇస్తున్న ఫోజులు కిరాక్ అనే చెప్పాలి.
#KritiSanon pic.twitter.com/nUVxfHTkAR
— VD bulletin (@vdbulletin) November 6, 2023
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa