విజయ్ దేవరకొండ ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్లతో 'ఫామిలీ స్టార్' సినిమా షూటింగ్ చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా రానున్న సంక్రాంతి పండగకి విడుదలవుతుందని అధికారికంగా ప్రకటించారు కూడా. ప్రస్తుతం విజయ్ ఈ సినిమా తొందరగా పూర్తి చెయ్యాలన్న ఆలోచనలోనే వున్నాడు అని తెలుస్తోంది. దీని తరువాత 'వీడీ 12' ఉంటుంది, దానికి దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. ఈ సినిమా అధికారికంగా లాంచ్ అయినప్పుడు శ్రీలీల ఇందులో కథానాయకురాలు అని అన్నారు, ఆమె సినిమా ముహూర్తం జరిగినప్పుడు కూడా హాజరు అయింది.అయితే ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో రష్మిక మందన్న కథానాయకురాలు అని తెలిసింది. 'గీత గోవిందం' , 'డియర్ కామ్రేడ్' సినిమాల తరువాత ఈ ఇద్దరూ కలిసి చేస్తున్న సినిమా ఇదే అవటం ఆసక్తికరం. విజయ్ దేవరకొండ, రష్మిక ఇద్దరూ రిలేషన్ షిప్ లో వున్నారు అని చాలా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరూ మళ్ళీ ఈ సినిమా చేస్తూ ఉండటం ఆసక్తికరమే కదా.అయితే ఇందులో శ్రీలీల ని కూడా మార్చారు అని కొన్ని వార్తలు వస్తూ వున్నాయి. ఆమె ప్లేస్ లో సాక్షి వైద్య ని తీసుకున్నారని కూడా అంటున్నారు. ఒకవేళ తీసుకున్నా ఆమె రెండో కథానాయకురాలే అవుతుందని, మెయిన్ రష్మిక మందన్న చేస్తోందని తెలిసింది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్ కొంచెం లేట్ అయేట్టు ఉందని, ఎందుకంటే విజయ్ ముందుగా 'ఫామిలీ స్టార్' పూర్తి చేస్తే కానీ ఈ సినిమాకి షిఫ్ట్ అవకపోవటం వలన, గౌతమ్ తిన్ననూరి సినిమా షూటింగ్ జనవరి నుంచి అవొచ్చు అని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa