విలక్షణ నటుడు నాజర్కు పితృ వియోగం కలిగింది. ఆయన తండ్రి మాబూబ్ బాషా (95) మంగళవారం కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తమిళనాడు చెంగల్పట్టు జిల్లాలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని నాజర్ కుటుంబ సభ్యులు వెల్లడించారు. తండ్రి మరణంతో నాజర్ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. సినీ ప్రముఖులు, సన్నిహితులు సోషల్ మీడియా వేదికగా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. మాబూబ్ బాషా పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa