సుదీప్తో సేన్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ది కేరళ స్టోరీ' చిత్రం అరుదైన ఘనత సాధించింది. 2023లో అత్యంత ప్రజాదరణ పొందిన హిందీ థియేట్రికల్ చిత్రాల జాబితాలో రెండో స్థానం దక్కించుకుంది. తాజాగా ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన ఈ జాబితాలో.. 'జవాన్' తొలి స్థానం సాధించగా, 'ది కేరళ స్టోరీ' రెండో స్థానంలో నిలిచింది. కాగా, రూ.20 కోట్లతో రూపొందిన 'ది కేరళ స్టోరీ' సినిమా రూ.304 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది.