టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో సినిమా వస్తుంది అని అందరికి తెలిసిన విషయమే. ఈ మూవీకి 'గుంటూరు కారం' అని టైటిల్ మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియోలో ప్రత్యేకంగా వేసిన సెట్లో జరుగుతోంది. మహేష్ బాబుతో పాటు ప్రకాష్ రాజ్ మరికొందరు క్యారెక్టర్ యాక్టర్స్ ఈ షెడ్యూల్ లో పాల్కొంటున్నారు. మరో నాలుగు రోజుల పాటు షూటింగ్ జరగనుందని సమాచారం.
200 కోట్ల భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ చిత్రంలో శ్రీలీల, మీనాక్షి చౌదరి కథానాయికలుగా నటిస్తున్నారు. జగపతిబాబు విలన్గా నటిస్తున్న ఈ సినిమా జనవరి 13, 2024న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ విడుదలకి సిద్ధంగా ఉంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ట్రాక్ లో రానున్న ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుంది. ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa