సెప్టెంబర్ 20, 2023 అక్కినేని నాగేశ్వర రావు గారి 100వ పుట్టినరోజు కావటంతో, అయన కుటుంబ సభ్యులు, అన్నపూర్ణ స్టూడియోలో నాగేశ్వర రావు గారి విగ్రహం ఏర్పాటు చేశారు. మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడు ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ వేడుకకు సినీ పరిశ్రమ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన చాలామంది హాజరయ్యారు. అందరితోపాటు విలక్షణ నటుడు మోహన్ బాబు కూడా ఈ వేడుకకు హాజరయ్యారు. ఇదే వేడుకకు సీనియర్ నటీమణి జయసుధ కూడా హాజరయ్యారు. అయితే జయసుధ, మోహన్ బాబు పక్కపక్కనే కూర్చోవటం జరిగింది. నాగేశ్వరరావు కుమార్తె నాగ సుశీల మాట్లాడుతూ ఉండగా, జయసుధ తనకి ఎదో మెసేజ్ వచ్చింది అనేమో ఒక్కసారి ఫోన్ బయటకి తీసి చూసుకుంటున్నారు. పక్కనే వున్న మోహన్ బాబు వెంటనే ఫోన్ ఇప్పుడు చూడటం ఎందుకు అని వెంటనే ఆ ఫోన్ లాక్కొని, మరలా జయసుధకు ఇచ్చేసారు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa