నాగ్ అశ్విన్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటిస్తున్న 'ప్రాజెక్ట్ K' లో లెజెండరీ నటుడు కమల్ హాసన్ చేరిక అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ సినిమా కమల హస్సన్ విలన్ పాత్ర పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా, నటుడి 233వ చిత్రం గురించి ఈరోజు ప్రకటన వెలువడింది. తీరన్ అధిగారమ్ ఒండ్రు (తెలుగులో ఖాకీ), సతురంగ వేట్టై, వాలిమై, తునివు వంటి చిత్రాలను రూపొందించిన ప్రతిభావంతులైన ఫిల్మ్ మేకర్ హెచ్.వినోత్ ఈ బిగ్గీకి దర్శకత్వం వహించనున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ చిత్రం రైతుల సమస్యలను హైలైట్ చేస్తుంది అని సమాచారం. KH233 అని తాత్కాలికంగా పేరు పెట్టబడిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్పై కమల్ హాసన్ మరియు R. మహేంద్రన్ నిర్మించనున్నారు. ఈ సినిమాలో నటీనటులు మరియు సిబ్బందికి సంబంధించిన ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa