పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన ఇరగోని మల్లయ్య-ఆగవ్వ దంపతులది చాలా పెద్ద కుటుంబం. కుటుంబీకుల మధ్య మనస్పర్థలు రావడంతో చాలా ఏళ్ల కింద దూరమయ్యారు. అప్పటి నుంచి ఎవరికి వారే అన్నట్లుగా బతుకుతున్నారు. అయితే ఇటీవల విడుదలైన ‘బలగం’ సినిమాను కుటుంబంలో కొందరు చూశారు. సినిమా చూసి చలించిపోయిన వీరు.. వేర్వేరు ప్రాంతాల్లో స్థిరపడిన తమ వాళ్లందరినీ ఒక్కచోట చేర్చేందుకు ప్రయత్నించారు. అందరినీ ఒప్పించి ఆదివారం ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాదాపు 156 మంది కుటుంబసభ్యులు ఒక్కచోట చేరి సరదాగా గడిపారు.
![]() |
![]() |
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa